ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) ప్రిలిమినరీ కీ ని సోమవారం విడుదల చేశారు. కీ ని వెబ్సైట్లో ఉంచామని ఎస్పీఆర్ఈ డైరెక్టర్ బి.శేషుకుమారి తెలిపారు. ఈనెల 27వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు అభ్యంతరాలు స్వీకరించి, 29న ఫైనల్ కీ విడుదల చేస్తామని పేర్కొన్నారు. ఆగస్టు 5న ఫలితాలు వెల్లడిస్తామని శేషుకుమారి వివరించారు.