చలికాలం వస్తోందంటేనే వెన్నులో వణుకు తెలియకుండా వచ్చేస్తుంది..ఈ కాలంలో ఎక్కువగా వ్యాదులు కూడా వచ్చి చేరుతాయి. శరీరంలో ఇమ్మ్యునిటీ శాతం చాలా తగ్గిపోతూ ఉంటుంది..శరీరంలో వేడి తగ్గిపోతుంది..వ్యాధినిరోధక శక్తి తగ్గి వ్యాధులు ప్రభాలే అవకాశం కూడా ఎక్కువగానే ఉంటుంది.అందుకే మనం తినే ఆహార విషయంలో చాలా జాగ్రత్తగా ఉండటం చాలా మంచిది..రోగనిరోధకశక్తిని ఎప్పటికప్పుడు పెంచుకుంటూ ఉండాలి..అయితే మనం తినే ఆహరం విషయంలో కూడా జాగ్రత్తలు పాటిస్తూ ఉండాలి. అసలకు..ఏ ఆహరం తినాలి..అనే విషయం మనం తెలుసుకుందాం.
శీతాకాలంలో మనం రోజు తీసుకునే ఆహారాల్లో మిరియాలు ఉండేలా చూసుకోండి.ఎందుకంటే వీటిలో ఎక్కువగా యాంటి వైరల్ గుణాలు ఉంటాయి..శరీరంలో వేడిని పెంచడానికి ఇవి బాగా ఉపయోగపడుతాయి. వీటిని సేవించిన నిమిషాల వ్యవధిలోనే శరీరంలో వేడిమి స్థాయి పెరిగిపోతుంది కూడా .
అదేవిధంగా..జలుబు బారిన పడకుండా మెంతులు చాలా బాగా ఉపయోగపడతాయి. ఒక స్పూనుడు మెంతులు తీసుకుని వాటిని కొంచం నీటిలో నానబెట్టి..ఆ తరువాత ఒక పేస్టులా చేసుకోవాలి..ప్రతీ రోజు మనం తినే ఆహారంలో కొంచం ఈ పేస్టుని మిక్స్ చేస్తూ వాడుతూ ఉండండి..ఇలా చేయడం వల్ల శరీరంలో జలుబు తొందరగా తగ్గుతుంది..
తులసి మొక్క..ఎంతో ఆరోగ్యకరమైనది దీనిలో విటమిన్ “ఏ” సి “ ఐరన్ ఎక్కువగా ఉంటాయి..శ్వాస సంభందిత వ్యదులకి చెక్ పెడుతుంది కూడా. అల్లం రక్త ప్రసరణ మెరుగవుతుంది...శరీరంలో వేడిని పెంచుతుంది. జీర్ణశక్తిని పెంచడానికి.. రోగనిరోధక శక్తిని పెంచడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. అయితే తులసి, అల్లం కలిపి తయారు చేసే టీ వల్ల చాలా ప్రయోజనాలుంటాయి.
అన్నిటికంటే కూడా అత్యంత ఉపయోగ కరమైనది పసుపు..పసుపు ముఖ్య గుణం ఏమిటి అంటే రోగ నిరోధక శక్తిని పెంచుతుంది...ఇందులో యాంటీవైరల్, యాంటీ ఫంగల్, యాంటీ బాక్టీరియల్ గుణాలుంటాయి. రక్త ప్రసరణ మెరుగుపరచడానికి..కాలేయ యొక్క పని తీరుని మెరుగు పరచడానికి..జీర్ణక్రియను పెంచడానికి పసుపు ఎంతో ఉపయోగ పడుతుంది...రోజూ కాస్త గోరు వెచ్చని నీటిలో చిటికెడు పసుపు పొడిని, స్పూనుడు మిరియాల పొడిని త్రాగితే మంచి ఫలితం ఉంటుంది.