ఒక రోజు రఘు తన తండ్రితో పాటు ఒక కొండ ప్రాంతంలో నడుస్తూ వెళ్తున్నాడు. రఘు అడిగే చిలిపి ప్రశ్నలకు అతని తండ్రికి ఓపికగా, నింపాదిగా సమాధానం చెబుతున్నారు. అంతలో ఒక రాయి తగిలి రఘు కింద పడిపోయాడు దెచ్చ బాగా తగలడంతో ‘‘ అమ్మా’’ అని అరిచాడు అతను అరవకున్నా మరోసారి ‘‘ అమ్మా’’ అనే శబ్దం వినబడడంతో ఆశ్చర్యపోయాడు.  ఆ శబ్దం కొండల్లోంచి కావడాన్ని గమినించాడు. ఆశ్చర్యాన్ని తట్టుకోలేక రఘు ‘‘ఎవరు నువ్వు’’ అని అడిగాడు శబ్దం వినింపించినవైపు చూస్తూ’’ ‘‘ ఎవరు నువ్వు’’ మరల ఆ గొంతుక పలికింది. రఘఉ మళ్లీ కొంచెం గట్టిగా నీకు దైర్యం ఉందా ఫ అని అరిచాడు అదే మాట ముందు కంటే గట్టిగా అతనికి వినిపించింది. ఇక లాభం లేదనుకున్న రఘ తండ్రితో ‘‘ నాన్నా ! ఏంటిది ? ఎవరు నాన్నా అక్కడ?’’ అని అడిగాడు . తండ్రి నవ్వుతూ ‘‘ కొంచెం ఓపిక పట్టు’’ అంటూ నువ్వు చాంఫియన్వీ’’ అని గట్టిగా ‘‘ నువ్వు చాంపీయన్ వి’’ అన్న శబ్బమే మళ్లి వినిపించింది. ఆశ్చర్యపోయిన రఘకి ఏం జరుగుతుందో అస్సలు అర్థకాలేదు.  రఘు తండ్రి అతనికి ఇలా చెప్పాడు ‘‘ దీన్ని ప్రతిద్వని అంటారు బాబు! జీవితం కూడా ఇలాంటిదే నీవు ఏది పలికినా ఏది చేసినా దాని ప్రతిఫలం నీకు తప్పక లభిస్తుంది. మన జీవితం మనం చేసే పనులకు ప్రతిబింబం వంటిది ప్రపంచంలో ప్రేమ శాంతి వికసించాలి, అందరూ నీతో ప్రేమగా వుండాలి’ అని నువ్వు అనుకుంటే నీ మనసులో ప్రేమ, శాంతికి అపారమైన చోటు కల్పించాలి.  ఏ జట్టులో పట్టుదల, విజయ కాంక్ష రగిలించాలంటే నీలో అవి పుష్కలంగా వుండాలి. లేకపోతే విజయ కాంక్షని పురిగొల్పాలి. ఈ సహజమైన బందం అందరి జీవితాలలో అన్ని సందర్బాలకి వర్తిస్తుంది. జీవితానికి మనం ఏది ఇస్తే మనకి అదే ఇస్తుంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: