మన శరీరానికి సమయానికి భోజనం మరియు నిద్రవంటివి చాల అవసరం. ఈ రెండిటిల్లో ఏది తేడా వచ్చినా అవి మన ఆరోగ్యం పై తీవ్రంగా ప్రభావాన్ని చూపెడతాయని అనేక అధ్యయనాలు చెపుతున్నాయి. సమయానికి తినకపోవడం  మరియు సమయానికి పోడుకోక పోవడం వల్ల వచ్చే ఆరోగ్య సమస్యల గురించి డాక్టర్లు కూడ అనేక హెచ్చరికలు ఇస్తున్నారు. రాత్రి ఆలస్యంగా భోజనం లేదా స్నాక్స్ తినటం వంటి కార్యాలు మన నిద్రను భంగానికి గురి చేస్తాయి. ఈ అలవాట్లు అజీర్ణం వంటిని కలుగచేసి, రాత్రిళ్ళు వివిధ రకాల సమస్యలకు కారణమవుతాయి. రోజు రాత్రి సమయంలో నిద్రాభంగం ఉంటే రాత్రి భోజనాన్ని త్వరగా ముగించడం మంచిది అని డాక్టర్లు చెపుతున్నారు. 

రాత్రి సమయంలో మితిమీరిన స్థాయిలో తినటం వలన కూడా నిద్రకు భంగం కలగవచ్చు. గుండెమంట, ఆసిడిటీ, గ్యాస్ వంటి సమస్యలతో సతమతం అవుతున్నప్పుడు ఇలా డిన్నర్ లేట్ గా చేయడం వల్ల ఈ సమస్యలు మరింత ఎక్కువ అవుతాయి. రాత్రి భోజనం తిన్న తరువాత త్వరగా పడుకోవటం వలన మన శరీరంలో ఆహరం జీర్ణం అవటానికి సరైన సమయం కేటాయించ లేదని అర్థం అవుతుంది. దీని వలన జీర్ణ వ్యవస్థ నెమ్మదిగా మారి, ఇతరేతర సమస్యలకు కారణం అవవచ్చు. 

సరైన సమయంలో రాత్రి భోజనం చేయటం మరియు గుండె ఆరోగ్యం మధ్య సంబంధం ఉందని డాక్టర్లు చెపుతున్నారు. రాత్రి భోజనం త్వరగా చేయటం వలన హార్ట్ స్ట్రోక్ మరియు అటాక్ లు తక్కువగా కలుగుతాయి. ఆలస్యంగా తినటం వలన తీసుకునే క్యాలరీల సంఖ్య పెరగటం, శరీరంలో ఇవి వినియోగపడకపోవటం వలన ట్రైగ్లిసరైడ్ లుగా శరీరంలో నిల్వ ఉండి, హార్ట్ స్ట్రోక్ మరియు హార్ట్ అటాక్ వంటి రోగాలను కలిగిస్తున్నాయి అని పరిశోధనలు చెపుతున్నాయి. 

రాత్రి త్వరగా భోజనం చేసి పడుకోవటం వలన మరునాడు ఉదయం మనం ఆరోగ్యంగా ఉండటమే కాకుండా మన శరీరానికి అవసరమైన వ్యాయామాలు చేసే సమయం కూడా లభిస్తుంది. వ్యాయామాల వలన మనకు ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో మరియు ఆరోగ్యం ఎలా మెరుగుపడుతుందో మన అందరికి తెలిసిందే. అయితే ప్రస్తుతం చాలామందికి ఉన్న పనుల ఒత్తిడి వల్ల ఈ ఎర్లీ డిన్నర్ చాలామందికి సాధ్యం కాని నేపధ్యంలో ఇది ఆచరించడం కష్టమే అయినా ప్రయత్నించి చూస్తే ఫలితాలు కనిపిస్తాయి..



మరింత సమాచారం తెలుసుకోండి: