నవంబర్ నుండి మొదలైన చలికాలం ఫిబ్రవరి వరకు ఉంటుంది.  ఒకవైపు గజగజ వణికించే చలి వల్ల రకరకాల ఆరోగ్య సమస్యలు కూడ వస్తూ ఉంటాయి. అయితే ఈ అనారోగ్య సమస్యలు రాకుండా మనం ఆరోగ్యంగా ఉండటానికి కొన్ని రకాల కూరలు పండ్లు తింటే ఎంతో ఆరోగ్యం చేకూరుతుందని చెపుతూ ఉంటారు. ఇప్పుడు వాటిని గురించి తెలుసుకుందాం.
 
ఈ చలికాలంలో క్యారెట్ ఎంత అధికంగా తింటే అంత మంచిది అని అంటారు. క్యారెట్ లో విటమిన్ సి తో పాటు పుష్కలంగా పొటాషింయ, మినిరల్స్, ఫొల్లెట్ మరియు ఫైబర్స్ ఎంతో ఉండటంతో ఈ క్యారెట్ జ్యూస్ ను తీసుకోవడం వల్ల శీతాకాలంలో తరుచూ వేదించే జలుబు, దగ్గు నుండి ఉపశమనం పొందవచ్చు. దగ్గు, జలుబుకు కారణం అయ్యే బ్యాక్టీరియాతో పోరాడగలిగే శక్తి ఇందులో అధికంగా ఉన్నాయి. 

దీనితో పాటు ఈ సీజన్ లో ఆరెంజ్ ను బాగా తినడం వల్ల యాంటీబయాటిక్ అవసరం అన్నదే ఈ కాలంలో ఏర్పడదు.  ఈ శీతాకాలంలో రోజుకు ఒక ఆపిల్ తినడం వల్ల డాక్టర్ సంప్రదించాల్సిన పనిలేదు అని అంటారు. ఆపిల్స్ లో ఫైటోన్యూట్రియంట్స్, ఫ్లెవనాయిడ్స్, మరియు యాంటీఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉండటం వల్ల మన శరీరాన్ని అనారోగ్య పాలవ్వకుండా ఈ యాపిల్ తినే అలవాటు మనలను రక్షిస్తుంది.

అంతేకాకుండా ఈ సీజన్ లో ఆకు కూరలు ఎంత ఎక్కువ తీసుకుంటే అంత మంచిది. ఆకుకూరల్లో ఫెవనాయిడ్స్ , విటమిన్స్ మినిరల్స్ అధికంగా ఉంటాయి. ఇంకా విటిమన్ ఎ, సి, కె మరియు ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ కూడా ఎక్కువ.  ఆకు కూరలతో పాటు ఈ సీజన్ లో బాగా లభించే పచ్చిబఠానీలు మన ఆహారంలో ఎక్కువగా తీసుకుంటే మరింత మంచిది. 

వీటితో పాటు ముల్లంగి బీట్ రూట్ ఈ సీజన్ లో ఎంత ఎక్కువ తీసుకుంటే వాటిలో ఉండే  పొటాషియం, ఫోలిక్ యాసిడ్, ఆక్సార్బిక్ యాసిడ్స్  మన శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. రకరకాల అనారోగ్యాలతో ఈ వింటర్ లో డాక్టర్ చుట్టూ తిరిగేకన్నా ఈ రకరకాల పండ్లు కూరగాలను మనం ఆహారంలో ఎంత తీసుకుంటే అంత మేలు..


మరింత సమాచారం తెలుసుకోండి: