టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారిన మూవీ అల్లుడు శీను. ఎందుకంటే ఈ మూవీ ద్వార టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీకి కొత్త హీరో పరిచయం అవుతున్నాడు. తను టాలీవుడ్ కి చెందిన భారీ ప్రొడ్యూజర్ కొడుకు కావటమే ఈ మూవీ హైలెట్. బెల్లంకొండ సురేష్ నిర్మిస్తున్న అల్లుడు శీను మూవీలో తన తనయుడు బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా పరిచయం అవుతున్నాడు. బెల్లంకొండ శ్రీనివాస్ ని తెరకు ఘనంగా పరిచయం చేయటానికి ఏ చిన్న అంశాన్ని ఆయన తండ్రి సురేష్ విడిచిపెట్టడంలేదు. గతంలో భారీ చిత్రాలతో పాటు డబ్బింగ్ చిత్రాలను రైట్స్ తీసుకొని భారీ సక్సెస్ లు పొందాడు బెల్లంకొండ సురేష్. అయితే తన మూవీల సక్సెస్ ఫార్ములాకి కారణం పబ్లిసిటి కూడ ఒకటి అని అంటుంది టాలీవుడ్. ఎందుకంటే ఫిల్మ్ ఇండస్ట్రీలో మూవీల పబ్లిసిటికి భారీగా ఖర్చు పెట్టే నిర్మాతలలో సురేష్ ఒకరు. అలాంటిది తన తనయుడు నటిస్తున్న మూవీ అల్లుడు శీను కోసం, బెల్లంకొండ సురేష్ కోట్ల రూపాయలలో ఖర్చు పెడుతున్నట్టుగా టాలీవుడ్ లో క్లియర్ టాక్స్ వినిపిస్తున్నాయి. వి.వి వినాయక్ లాంటి టాప్ డైరెక్టర్, సమంత, తమన్నా లాంటి స్టార్ హీరోయిన్లని తన కొడుకు ఎంట్రి కోసం తీసుకున్నాడు. అలాగే దేవి శ్రీ ప్రసాద్ ట్యూన్స్ చేసిన పాటలను భారీ సెట్ లలో చిత్రీకరించారు. మీడియా యాడ్ లకు లెక్కలేకుండా ఖర్చు పెట్టేయమని ఆర్డర్ లు జారీ చేసాడట. ఇప్పటికే హైదరాబాద్ లో చాలా హోర్డింగ్ లు పెట్టేశారు. కేవలం పబ్లిసిటి ఖర్చు లెక్క చూస్తేనే దాదాపు 3 కోట్ల రూపాయలుగా లెక్క తేలింది. అలాగే స్పెషల్ ప్రమోషన్స్ కోసం మరో కోటి రూపాయలను ఖర్చు చేస్తున్నాడు. ఈ రకంగా మూవీ రిలీజ్ నాటికి దాదాపు 50 కోట్ల రూపాయలను కొడుకు మూవీ కోసం బెల్లంకొండ సురేష్ ఖర్చుపెడుతున్నట్టుగా తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: