వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ సినిమా తరువాత టాలీవుడ్ లో రకుల్ ప్రీత్ సింగ్ కు క్రేజ్ పెరిగింది. ప్రస్తతం ఈ బ్యూటీ రామ్ గోపీచంద్, అది లాంటి హీరోలతో పాటు మంచు వారి అబ్బాయి మనోజ్ తో కూడ ‘కరెంట్ తీగ’ లో నటిస్తోంది. ఈ సినిమాలో రకుల్ తోపా టు సన్నీ లియోన్ కుడా ఒక ప్రత్యక పాత్రలో నటిస్తోంది.  అయితే ఈ సినిమా కు సంభందించిన వార్తలలో కాని అలాగే ఈ సినిమా షూటింగ్ లోకాని ఈమె కంటే సన్నీ లియోన్ కే ఎక్కువ ప్రాధాన్యత లభిస్తూ ఉండటంతో అసలు ఈ సినిమాను ఎందుకు ఒప్పుకున్నానా అని రకుల్ తన సన్నిహితుల దగ్గర బాధ పడుతోందని టాక్. ఈ పరిస్థితులు ఇలా ఉండగా ఈ సినిమాలోని ఐటమ్ సాంగ్ తో పాటు కొన్ని సన్నివేశాల చిత్రీకరణను పూర్తి చేసుకుని ముంబైకి తిరిగి వెళ్లిపోయిన సన్నీ ‘కరెంట్ తీగ’ షూటింగ్ లో జరిగిన కొన్ని సంఘటనల గురించి గుర్తు చేసుకుంటూ ట్విటర్ లో పోస్ట్ చేసింది. మంచువారి ప్రేమలో తాను కరిగిపోయినందుకు తనకు చాలా సంతోషంగా వుందంటూ కామెంట్లు చేసింది. అంతేకాదు మంచు ఫ్యామిలీ ‘‘కరెంటు తీగ’’ సినిమా షూటింగ్ సందర్భంలో సన్నీని ఆమె భర్తను కుడా ఘనంగా సన్మానించిందట మంచు ఫ్యామిలీ, ఈ సత్కారానికి పొంగిపోయి సన్నీ తన కృతజ్ఞతలు కూడ తెలియచేసుకుంది. బహుశా ఇవన్ని చూసి కాబోలు రకుల్ సన్నీ పై కోపం పెంచుకుంది అనుకోవాలి.  

మరింత సమాచారం తెలుసుకోండి: