హీరోయిన్ త్రిషను చెన్నై విమానాశ్రయంలో భద్రతాధికారులు అడ్డుకున్నారు అనే వార్తలు వస్తున్నాయి. అంతేకాదు ఈ చెన్నై బ్యూటీకి భద్రతా అధికారులకు మధ్య వాగ్వివాదం కూడ కొంత చోటుచేసుకుందని వార్తలు వస్తున్నాయి. హైదరాబాద్‌ వెళ్లే నిమిత్తం త్రిష ఉదయం 8 గంటలకు విమానాశ్రయానికి వచ్చిన సందర్భంలో ఈ సంఘటన చోటు చేసుకుందని కోలీవుడ్ మీడియా వార్తలు రాస్తోంది.  దీనికి కారణం ఎయిర్ పోర్ట్ భద్రతాధికారులు ఆమెను గుర్తింపు కార్డు చూపమని అడిగితే ఆమె తిక్క సమాధానాలు చెప్పడంతో ఈ వివాదం చోటుచేసుకుందని న్యూస్. ఈ లోపున త్రిషకు తెలిసిన కొందరు ఈ వ్యవహారాన్ని సర్దుబాటు చేయడంతో ఆమె హైదరాబాద్‌ విమానమెక్కినట్లు టాక్. ఈ సంఘటనకు ముందు ఆమె మీడియాతో మాట్లాడుతూ చూసిన సినిమానే మళ్లీ మళ్లీ చూడాలని ఎవరికీ ఎలా అనిపించదో తనకూ చేసిన పాత్రని మళ్ళీ మళ్ళీ చేయాలని అనిపించడం లేదని అందుకే తనకు తెలుగు, తమిళ భాషలలో సినిమాలు తగ్గాయని చెప్పుకొచ్చింది.  అంతేకాదు తనకు విద్యాబాలన్ నటించిన ‘కహాని’, డర్టీ పిక్చర్’ లాంటి సినిమాలు చేయాలనీ ఉందని కలలు కంటోంది ఈ చెన్నై బ్యూటీ. కాని త్రిషను నమ్మి ఇటువంటి సినిమాలను ఎవరు ఇస్తారు అన్నదే ప్రశ్న. ఇంతకీ షూటింగ్ లు కూడ లేకుండా ఈ డస్కీ బ్యూటీ ఇంత హడావిడిగా హైదరాబాద్ ఎందుకు వచ్చింది అన్నదే సస్పెన్స్.  

మరింత సమాచారం తెలుసుకోండి: