మెగాస్టార్ చిరంజీవి నటించబోతున్న 150వ సినిమాకి సంబంధించిన వివరాలు చిన్న చిన్నగా బయటకు వస్తున్నాయి. ఇప్పటి వరకూ చిరంజీవి తన 150వ సినిమానికి సంబంధించిన ప్రతి విషయాన్ని రహస్యంగా ఉంచుతూ వస్తున్నాడు. కాని ఇప్పుడు మాత్రం తను చేయబోతున్న ఆ 150 చిత్రానికి సంబంధించిన వివరాలను తన నోటి నుండి కాకుండా లీకేజీల ద్వార బయటకు తెలియపరుస్తున్నాడు. ఏదోక సందర్భంలో రామ్ చరణ్ , వినాయక్ లు ఈ విషయాన్ని పదే పదే మీడియాకు తెలియపరుస్తున్నారు. మొత్తంగా దీన్ని చూస్తుంటే చిరంజీవి 150 సినిమాకి రంగం సిద్ధం అయిందని టాలీవుడ్ అంటుంది. చిరంజీవి 150వ సినిమాకి ముహర్తం కూడ దగ్గర పడిందని అంటున్నారు. ఆగష్టు 22న మెగా స్టార్ చిరంజీవి పుట్టినరోజు వేడుకలు ఉండటంతో, అదే రోజున ఆ మూవీకి సంబంధించిన అఫిషియల్ అనౌన్స్ మెంట్ ని స్వయంగా చిరంజీవి చెప్పబోతున్నాడు. ఇప్పటికే స్క్రిప్ట్ కి సంబంధించిన పనులు స్టార్ట్ అయ్యాయి. అలాగే స్టోరి లైన్ కి చిరంజీవి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. తను నటించబోతున్న 150వ చిత్రానికి నిర్మాతలుగా గీతా ఆర్ట్స్, రామ్ చరణ్ లు ఉండబోతున్నారు. దర్శకుడిగా వినాయక్ ఉంటున్నారంటూ అంటూ టాలీవుడ్ లో క్లియర్ టాక్స్ వినిపిస్తున్నాయి. అయితే చిరంజీవి ఓ పొలిటికల్ స్టోరికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా కథనాలు వినిపిస్తున్నాయి. తను పొలిటికల్ రంగంలోకి అడుగుపెట్టిన తరువాత ఏదైతే సాధించాలనుకున్నాడో, వాటికి అడుగడుగా అడ్డంకులు ఏర్పడుతూనే వస్తున్నాయని చిరంజీవి గతంలో చెప్పుకొచ్చారు. ఇప్పడు అదే విషయాన్ని ఓ స్టోరి రూపంలో తనదైన శైలిలో చూపించటానికి చిరంజీవి ఆసక్తి చూపుతున్నారంట. మొత్తానికి చిరంజీవి ఎంచుకున్న పొలిటికల్ స్టోరి ఏ విధంగా ఉండబోతుంది అనేది మెగా అభిమానుల్లో ఆసక్తిని రేపుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: