‘తీన్‌మార్’ సినిమాలో పవన్‌కల్యాణ్ తో నటించిన కృతి కర్బందా మరణం అంచు వరకు వెళ్ళి వచ్చానని చెపుతోంది. ‘తీన్ మార్’ కలిసి రాకపోవడంతో ఆమధ్య రామ్ తో ‘ఒంగోలు గిత్త’ లో మెరిసినా అదికూడా కలిసిరాలేదు. ఇక చేసేది ఏమి లేక ప్రస్తుతం కన్నడ సినిమాలలో నటిస్తూ కాలం గడుపుతోంది. అయితే ఈమెకు లేటెస్ట్ గా ఒక కన్నడ సినిమా షూటింగ్ సందర్భంగా బెంగుళూరు లోని ఒక ప్రముఖ హోటల్ లో ఉన్నప్పుడు ఆమెకు జరిగిన ఒక ప్రమాదకర సంఘటన ఈ మధ్య మీడియాతో షేర్ చేసుకుంది. షూటింగ్ అయిపోయిన తరువాత కృతి తను దిగిన హోటల్ రూమ్ లో టివి చూస్తూ నిద్రలోకి జారుకుందట ఈ అమ్మడు. అయితే కొద్ది సేపటికి మంటల శబ్దం వినిపిస్తే కృతి మంచి నిద్రలో ఉండి అది కలేమో అనుకుందట. అయితే కొద్దిసేపటికి ఆ మంటల వేడికి కృతికి మెలుకవ వచ్చి చేసేసరికి అది కల కాదు నిజమే అని తెలుసుకుని ఉలిక్కిపడిందట కృతి. దానితో భయపడిన కృతి తడి టవలును ఒంటికి చుట్టుకుని హోటల్ రూమ్ నుంచి పరుగులు పెట్టిందట. అనుకోని ఈ సంఘటనకు భయపడిన కృతి తాను ఆ క్షణంలో మరణం దగ్గర వరకు వెళ్ళి వచ్చాను అని అంటోంది ఈ పవన్ హీరోయిన్. ఏమైనా కృతి పెద్ద ప్రమాదం నుండి గట్టెక్కింది అని అనుకోవాలి.   

మరింత సమాచారం తెలుసుకోండి: