రామ్ చరణ్ నటిస్తున్న ‘గోవిందుడు అందరివాడేలే’ సినిమా అక్టోబర్ 1న విడుదల అవుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటి దాకా ఈసినిమాకు మహేష్ ‘ఆగడు’ సినిమాకు మధ్య వార్ ఉంటుంది అని అనుకున్నారు అంతా. అయితే ఈ ఇద్దరి యంగ్ హీరోల వార్ మధ్య విలక్షణ నటుడు కమలహాసన్ మధ్యలో రావడం అందర్నీ ఆశ్చర్య పరుస్తోంది.  కమలహాసన్ నటిస్తున్న ‘ఉత్తమ విలన్’ సినిమా విడుదలకు డేట్ ఫిక్స్ అయిందని లేటెస్ట్ న్యూస్. కమల్ రెగ్యులర్ సినిమాలకన్నా చాల వేగంగా తీసిన ఈ సినిమాను కోలీవుడ్, టాలీవుడ్ లలో అక్టోబర్ 2న రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారని మీడియాలో వార్తలు వస్తున్నాయి.  అనేక తమిళ, కన్నడ భాషల సినిమాలలో నటించిన కమల్ స్నేహితుడు రమేష్ అరవింద్ డైరెక్షన్లో తమిళ దర్శకుడు లింగుస్వామి ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ఈ సినిమాలో కమల్ రెండు విభిన్న పాత్రల్లో కనిపించబోతున్నాడు. ఆండ్రియా, పూజా కుమార్ హీరోయిన్స్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో సీనియర్ డైరెక్టర్ కె.బాలచందర్‌తోపాటు కె.విశ్వనాధ్,నాజర్ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు అన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన కమల్ ఫస్ట్‌లుక్‌ ఒక హాలీవుడ్ సినిమాకు కాపీ స్టిల్ అంటూ వార్తలు వస్తున్న నేపధ్యంలో ఈ సినిమా విడుదల అయ్యాక ఇంకా ఎన్ని వివాదాలలో చిక్కుకుంటుందో చూడాలి.  

మరింత సమాచారం తెలుసుకోండి: