ఈమధ్యనే తెలంగాణ రాష్ట్ర బ్రాండ్ అంబాసిడర్ గా కలలో కూడ ఉహించని అరుదైన గౌరవాన్ని పొందడమే కాకుండా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుండి కోటి రూపాయల బహుమతిని పొందిన టెన్నీసు అందాల తార సానియా మీర్జాకు టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు షాక్ ఇస్తాడా? అంటూ మీడియాలో వార్తలు వస్తున్నాయి. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రకటించినట్లుగానే ఆంధ్రప్రదేశ్ కు కూడ ఒక బ్రాండ్ అంబాసిడర్ ను ప్రకటించే ఆలోచనలో చంద్రబాబు ఉన్నాడు అంటూ వార్తలు వస్తున్నాయి. ఎపి హెరాల్డ్ కు తెలుస్తున్న సమాచారం మేరకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఎపి బ్రాండ్ అంబాసిడర్ గా మహేష్ బాబును నియమిస్తే ఎలా ఉంటుంది అని ఆలోచన చేస్తున్నట్లు టాక్. కాని ఒక టాలీవుడ్ హీరోను బ్రాండ్ అంబాసిడర్ గా నియమిస్తే ఇప్పటికే టాలీవుడ్ లో టాప్ హీరోలుగా వెలుగొందుతున్న బాలకృష్ణ పవన్ లతో ఉన్న సన్నిహిత సంబందాల రీత్యా ఆ ఇరువురి హీరోలకు ఏమైనా మనస్తాపం కలుగుతుందా అనే విషయం కూడ చంద్రబాబు ఆలోచనలలో ఉంది అని అంటున్నారు. మహేష్ కాకుంటే జాతీయ స్థాయిలో పేరుగాంచి ఆంధ్రప్రదేశ్ కు చెందిన మరొక టాప్ సేలిబ్రెటీ ఎవరు? అనే కోణంలో కూడ చంద్రబాబు ఆలోచనలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే మహేష్ పాపులారిటీ అటు తెలంగాణా ఇటు ఆంధ్రప్రదేశ్ లోని రెండు రాష్ట్రాలలోను టాప్ పొజిషన్ లో కొనసాగుతూ ఉండటంతో మహేష్ ధైర్యం చేసి ఒక రాష్ట్రానికి బ్రాండ్ అంబాసిడర్ గా కొనసాగడానికి అంగీకరిస్తాడా అన్నదే ప్రశ్న? ఈ వార్తలే నిజం అయితే మహేష్ సానియా మీర్జాకు గట్టి పోటీయే అనుకోవాలి.  

మరింత సమాచారం తెలుసుకోండి: