హీరో నాగార్జున బుల్లితెరపై చేస్తున్న‘మీలోఎవరుకోటీశ్వరుడు’ ప్రోగ్రామ్ కు భారీ రేటింగ్స్ వస్తున్నప్పటికీ ఈషోను త్వరలో ముగిస్తారని వార్తలు వస్తున్నాయి. ఈ షోకు వస్తున్నరేటింగ్స్ రీత్యా ఈకార్యక్రమాన్ని ఆదివారానికి కూడా పొడిగించటం ద్వారా ముందుగా నిర్ణయించుకున్న 40 కంటే ఎక్కువ ఎపిసోడ్స్ ప్రసారం చేయగలిగారు అని వార్తలు వస్తున్నాయి. జాతీయస్థాయిలో అమితాబ్ బచ్చన్ ‘కౌన్ బనేగా కరోడ్ పతి’ ఎనిమిదవ సీజన్ మొదలు అవుతూ ఉండటంతో ఇక్కడ కోటీశ్వరుడు షోను ముగిస్తారు అనే వార్తలు వస్తున్నాయి.  దీనికి కారణం ఒకే సమయంలో రెండు చోట్ల ఈ కార్యక్రమం ప్రసారం కాకూడదన్నది దీని ప్రసారహక్కుల కొనుగోలు ఒప్పందంలో ఒక కండిషన్ అని టాక్. అందువల్ల మరికొంత విరామం తరువాత ఈ షో రెండో సీజన్ ప్రారంభించాలని మా టీవీ యాజమాన్యం ఆలోచిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇది ఇలా ఉండగా ఈ షో కు సంభందించి మరొక ఆసక్తి కర విషయం బయటకు వచ్చింది. కొద్దిరోజుల్లో ఈ ప్రోగ్రాం తొలి సీజన్ పూర్తి కాబో తూ ఉండటంతో ఈ కార్యక్రమ ముగింపు కూడా టాప్ రేంజ్‌లో ఉండాలని నాగార్జునతో పాటు ఈ షో నిర్వాహకులు భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈకార్యక్రమ ఫైనల్ ఎపిసోడ్‌కు ముఖ్యఅతిధిగా రజనీకాంత్, అనుష్కలు గెస్ట్‌లుగా హాజరుకాబోతున్నట్లు ప్రచారం సాగుతోంది.  ఇటీవల ‘లింగా’ మూవీ షూటింగ్ అన్నపూర్ణ స్టూడియోలో జరిగినప్పుడు నాగార్జున రజనీకాంత్ ను వ్యక్తిగతంగా రిక్వెస్ట్ చేయడంతో రజనీకాంత్ అనుష్కతో కలిసి ఈ షోకు వస్తానని నాగ్ కు మాట ఇచ్చినట్లుగా వార్తలు వస్తున్నాయి. అతి త్వరలోనే చిరంజీవి కూడ ఈ షోలో సందడి చేయబోతున్న సందడి తెలిసిందే. ఎదిఎమైనా నాగార్జున క్రేజ్ ను ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ మరింత పెంచింది అని అనుకోవాలి.   

మరింత సమాచారం తెలుసుకోండి: