టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎవరిపై అంతగా కామెంట్ చేయని నాగార్జున, ఇప్పుడు ఓ టాప్ హీరోయిన్ పై కామెంట్ చేసి హాట్ టాపిక్ గా మారాడు. ప్రస్తుతం నాగార్జున మనం మూవీ సక్సెస్ తో పాటు, తను బుల్లితెరలో నిర్వహిస్తున్న మీలో కోటీశ్వరుడు ఎవరు? అనే రియాలిటి షో కూడ గ్రాండ్ సక్సెస్ కావడంతో తెగ హ్యాపీ మూడ్ లో ఉన్నాడు. ఇదిలా ఉంటే తాజాగా ఓ టెలివిజన్ షోలో గెస్ట్ ఎప్పిరియన్స్ లో వెళ్ళిన నాగార్జున, సుహాసిని మణిరత్నం లు సరదా సరదాగా మాట్లాడుకున్నారు. అయితే సుహాసిని, నాగార్జునని కొన్ని హాట్ క్వశ్ఛన్స్ ని అడింది. దీనికి నాగార్జున చెప్పిన సమాధానం అందరిని ఆశ్ఛర్యపరిచింది. ప్రస్తుతం ఉన్న హీరోయిన్స్ లో మీకు హాట్ గా అనిపించిన హీరోయిన్ ఎవరు అంటూ నలుగురు హీరోయిన్స్ పేర్లని చెప్పుకొచ్చింది. అందులో సమంత, కాజల్, శృతిహాసన్, తమన్న పేర్లు ఉన్నాయి. వీరి నలుగురిలో నాగార్జున ఒకరిని సెలక్ట్ చేసుకున్నాడు. నాగార్జున చెప్పిన సమాధానం "మీరు చెప్పిన నలుగురిలో అందరూ హాట్ బ్యూటీ హీరోయిన్స్. అయితే వారందరి కంటే తమన్న వెరీ హాటెస్ట్" అంటూ సమాధానం చెప్పుకొచ్చాడు. అందరూ కాజల్ అగర్వాల్ అని గెస్ చేస్తే నాగార్జున మాత్రం ఏ మాత్రం మెహమాటం లేకుండా తమన్న తనకి నచ్చిన హీరోయిన్స్ లో వెరీ హాటెస్ట్ అంటూ చెప్పేసరికి సుహాసిని దీనికి సంబంధించిన టాపిక్ ని అక్కడితో ఆపేసింది. టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో అందుతున్న సమాచారం మేరకు నాగార్జున త్వరలో తమన్నకి హీరోయిన్ గా ఆఫర్ ఇవ్వనున్నాడని తెలుస్తుంది. అందుకే తమన్నపై ఆ విధంగా కామెంట్ చేసి ఉంటాడని అంటున్నారు. మొత్తానికి తమన్నపై తన మీద ఉన్న ఇంట్రెస్ట్ ని ఆ విధంగా చెప్పటంతో ఆ షోలోని వారంతా కొద్దిగా స్టన్ అయ్యారని చూసే వారికి తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: