సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో గ్లామర్ వార్ జరుగుతుంది. సౌత్ లో టాప్ హీరోయిన్స్ గా కెరీర్ ని కొనసాగిస్తున్న హీరోయిన్స్ సమంత అండ్ శ్రుతిహాసన్. వీరిద్దరి మధ్య ప్రస్తుతం గ్లామర్ వార్ గట్టిగానే కొనసాగుతుంది. ఒకరి ఆఫర్స్ ని ఒకరు చేజిక్కించుకోవటానికి తెగ ప్రయత్నాలు చేస్తున్నారు. ఎవరికి తగ్గ రేంజ్ లో వారు వారి స్టార్ డం స్టేటస్ ని ఉపయోగిస్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా సమంత, కార్తితో ఓ మూవీకి సిద్ధమైందనే వార్తలో కోలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో బలంగా వినిపించాయి. అన్న, తమ్ముళ్ళతో సమంత రొమాన్స్ అంటూ కోలీవుడ్ లో కామెంట్స్ వినిపించాయి. ఓ పక్క అంజాన్ మూవీలో సూర్యతో నటించి, మరోవైపు తమ్ముడు కార్తితో హాట్ రొమాన్స్ చేయటానికి సమంత రెడీగా ఉంది. అయితే ఇప్పుడు ఈ ఈక్వేషన్స్ మారిపోయాయి. తమ్ముడు కార్తి సరసన సమంత మారిపోయి చివరి నిముషంలో శ్రుతిహాసన్ వచ్చింది. శృతి హాసన్ తాజాగా తమిళంలో స్పీడు పెంచుతోంది. సమంతాతో పోటీ పడుతూ సినిమాలు ఒప్పుకుంటోంది. ఇప్పటికే మూడు సినిమాలు చేస్తున్న శ్రుతిహాసన్ తాజాగా కార్తి సరసన హీరోయిన్ గా చేయటానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో సమంత స్పీడ్ కి శ్రుతి హాసన్ బ్రేకులు వేసిందంటున్నారు. కార్తీ సరసన తొలిసారిగా నటించే చాన్స్ శ్రుతి హాసన్ కు వచ్చింది. గోకుల్ దర్శకత్వంలో రూపొందే ఈ సినిమా కోసం శ్రుతిహాసన్ బాగానే ప్రయత్నాలు చేసిందని అంటున్నారు. అయితే శ్రుతిహాసన్ ప్రస్తుతం బాగా బిజిగా ఉండటంతో కార్తి మూవీకి డేట్స్ ని అడ్జెట్ చేసే పనిలో ఉంది. మొత్తానికి సమంతకి శ్రుతిహాసన్ గట్టి షాక్ ని ఇచ్చిందని సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీ అంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: