కమర్షియల్ డైరెక్టర్ పూరీ జగన్నాధ్ కి ప్రిన్స్ మహేష్ బాబు ఓ కమిట్మెంట్ ని ఇచ్ఛాడు. ప్రస్తుతం ఈ న్యూస్ టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా వినిపిస్తుంది. గతంలో మహేష్ బాబు హీరోగా పూరీ జగన్నాథ్ తీసిన 'పోకిరి' సినిమా ఓ ఊపు ఊపేసింది. బాక్సాఫీసు షేకై పోయేలా వసూళ్లలో రికార్డు సృష్టించింది. ఆ తర్వాత మహేష్ బాబు మరింత బిజిగా మారుతూ టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీjr బ్లాక్ బాస్టర్ సక్సెస్ లని ఇస్తూ వస్తున్నాడు. అయితే పూరీ జగన్నాధ్ మాత్రం ఆశించినంత సక్సెస్ లని ఇండస్ట్రీకి ఇవ్వలేకపోతున్నాడు. పూరీజగన్నాధ్ ని చాలా మంది పోకిరి సీక్వెల్ ని తీస్తారా? అని అడిగితే మాట దాట వేస్తూ వస్తున్నాడు. కొన్ని సందర్భాల్లో అయితే ‘ఆ మాటని మహేష్ బాబుని అడగండి’ అంటూ మహేష్ బాబుపై ఫోకస్ చేయించాడు. ఇదిలా ఉంటే తాజాగా మహేష్ బాబు, పూరీ జగన్నాధ్ కి మాట ఇచ్చాడంట. కచ్ఛితంగా పోకిరి మూవీ సీక్వెల్ ఉండాలని మహేష్ కోరుకున్నాడు. దానికి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ ని పూర్తి చేయాలని పూరీని మహేష్ బాబు కోరినట్టు టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో క్లియర్ టాక్స్ వినిపిస్తున్నాయి. ప్రస్తుతం పూరీ జగన్నాధ్, జూనియర్ ఎన్టీఆర్ తో మూవీకి సిద్ధంగా ఉన్నాడు. ఈ ప్రాజెక్ట్ అనంతరం పోకిరి సీక్వెల్ ఉంటుందా? లేక తరువాత ఉంటుందా? అనేది తెలియాల్సి ఉంది. మొత్తానికి పోకిరి సంబంధించిన సీక్వెల్ ప్రస్తుతం పరిస్థితుల్లో వస్తే బ్లాక్ బస్టర్ సక్సెస్ ని సాధిస్తుందా? లేక బాక్సీపీస్ వద్ద బోర్లా పడుతుందో తెలియాలంటే సీక్వెల్ రెడీ అయి, రిలీజ్ వరకూ వెయిట్ చెయ్యాల్సిందే. అయితే ప్రముఖ నిర్మాత అశ్వనీదత్ ఈ చిత్రాన్ని నిర్మిస్తారు.

మరింత సమాచారం తెలుసుకోండి: