హీరో సందీప్ కిషన్ ఒక భయంకర ప్రమాదం నుండి తప్పించుకున్నాను తన ట్విటర్ లో న్యూస్ పెట్టి అందర్నీ ఖంగారు పెట్టాడు. ఇక వివరాలలోకి వెళితే ఉత్తర అండమాన్ దీవుల్లోని తీరప్రాంతంలో మంగళవారం స్వల్ప భూకంపం చోటుచేసుకుందట. అదే సమయానికి అక్కడ షూటింగ్ నిమిత్తం వెళ్లిన సందీప్ కిషన్ అతని టీమ్ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని అక్కడినుంచి బయిలుదేరిన వెంటనే ఈ భూకంపం వచ్చింది అని చెపుతున్నాడు. దానితో ఎటువంటి ప్రమాదం లేకుండా తనతో పాటు తన యూనిట్ సభ్యులు కూడ క్షేమంగా ఉన్నారు అంటూ సందీప్ పెట్టిన మెసేజ్ తో అందరు ఊపిరి పీల్చుకున్నారు. సందీప్ కిషన్ ప్రస్తుతం నటిస్తున్న ఒక కొత్త చిత్రం షూటింగ్ నిమిత్తం అండమాన్ దీవులలో గత నాలుగు రోజులుగా ఉంటున్న సమయంలో ఈ సంఘటన జరగడం ఆ సంఘటన నుండి ఎటువంటి ప్రమాదం లేకుండా సందీప్ కిషన్ బయటకు రావడం టాలీవుడ్ నిర్మాతలను ఆనంద పరుస్తోంది. అండమాన్ ప్రాంతంలో సంభవించిన ఈ భూకంపం రిక్టర్ స్కేలుపై 5.5 తీవ్రతతో ఉందని అయితే దీనివల్ల ఎటువంటి ప్రమాదం లేదని వాతావరణ శాఖ వివరణ ఇచ్చింది.  సందీప్ కిషన్ కుమార్ నాగేంద్ర దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఏమైనా మన టాలీవుడ్ హీరో ఎటువంటి ప్రమాదం లేకుండా గట్టేక్కాడు అని అనుకోవాలి.  

మరింత సమాచారం తెలుసుకోండి: