పివిపి నిర్మాణ సంస్థ అధినేతగా పొట్లూరి ప్రసాద్ టాలీవుడ్ లో అనేక సంచలనాలు చేస్తున్నాడు. భారీ సినిమాల నిర్మాతగా మారిన పొట్లూరి పవన్ ‘జనసేన’ వెనుక ఒక పవర్ అని అంటారు. గత ఎన్నికలలో పవన్ కళ్యాణ్ ఇమేజ్ ని ఆసరాగా తీసుకుని విజయవాడ పార్లమెంట్ స్థానానికి పోటీ చేద్దామని ఎంతో ప్రయత్నించినా పరిస్థుతులు కలిసిరాలేదు. కానీ అదే విజయవాడతో తన అనుభందాన్ని మరింత పెంచుకోవడానికి ఆగస్టు 1న విజయవాడలో సౌత్ ఇండియా బిగ్గెస్ట్ మల్టీప్లెక్స్ ‘పివిపి స్వ్కేర్' ను ప్రారంభించబోతున్నాడు. ఈ కార్యక్రమానికి ఇండియన్ క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ అతిధిగా వస్తున్న విషయం తెలిసిందే.  అయితే ఈ కార్యక్రమానికి మరింత క్రేజ్ తీసుకు రావడానికి సచిన్ తో పాటు స్వీటి అనుష్క కూడా ఈ కార్యక్రమానికి అతిథిగా వస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. సినిమా, రాజకీయ మరియు పారిశ్రామిక రంగాల నుంచి పలువురు ప్రముఖులు ఈ వేడుకలో పాలు పంచుకోనున్నారని టాక్. సినిమా రంగంలోనే కాకుండా క్రీడల పట్ల కూడ అత్యంత ఆశక్తి ఉన్న పొట్లూరి ‘ఐబిఎల్-ఇండియన్ బ్యాడ్మింటన్ లీగ్'లో ప్రాంచైజీ ఓనర్‌గా ఉన్నారు.  అదేవిధంగా పొట్లూరి ప్రసాద్ ఈ మధ్యనే క్రికెటర్ సచిన్ తో కలిపి ఇండియన్ సాకర్ లీగ్ లోకి అడుగు పెట్టారు అనే వార్తలు కూడ వచ్చాయి. క్రికెట్ దేవుడు సచిన్ తో ‘బాహుబలి’ రాజకుమారి కలిసి సందడి చేయడం సంచలనాత్మకంగా మారింది.  

మరింత సమాచారం తెలుసుకోండి: