మూడు తరాలుగా టాలీవుడ్ ను శాసిస్తున్న అక్కినేని హీరోకు హీరోల కొరత ఏర్పడింది అంటే ఎవరూ నమ్మరు. ఎందుకంటే వారి కుటుంబంలోనే ఎందరో హీరోలు ఉన్నారు. కానీ పేరుకు అక్కినేని మనవడు అయినా అక్కినేని నాగేశ్వరరావు ముద్దుల కొడుకుగా పిలిపించుకునే హీరో సుమంత్ కు ఇటువంటి విచిత్ర పరిస్థితి ఏర్పడింది. చాల కాలంగా విజయాలకు దూరంగా ఉన్న సుమంత్ ఇక తన కెరియర్ విషయంలో శ్రద్ధ పెట్టి ఒక బాలీవుడ్ మూవీని తానే హీరోగా తన మామయ్య నాగార్జున చేత నిర్మింప చేస్తున్నాడు. 'ప్రేమ ఇష్క్ కాదల్' సినిమా దర్శకుడు పవన్ సాదినేనితో ఇప్పుడు ఆ బాలీవుడ్ రీమేక్ కు ప్లాన్ చేస్తున్నాడు సుమంత్. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రానికి 'జిందగీ' అనే టైటిల్ నిర్ణయించగా ఆ సినిమాలో కలర్ స్వాతి హీరోయిన్ గా ఎంపికైనట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఈ సినిమా ఒక మల్టీ స్టారర్ సినిమా అని అంటున్నారు. బాలీవుడ్ లో హిట్ కొట్టిన మల్టీ స్టారర్ ‘జిందగీ న మిలలేగి దొబారా’ సినిమాకు రీమేక్ గా ఈ సినిమా ఉంటుందని టాక్. బాలీవుడ్ లో హ్రితిక్ రోషన్, కత్రినా, ఫరాన్ అక్తర్, అభయ్ డియోల్ నటించిన ఈ సినిమాను జోయా అక్తర్ దర్శకత్వం వహించాడు. ఇప్పటికే ఈ సినిమా రీమేక్ హక్కులను పొందిన నాగార్జున తన అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై ఈ సినిమాను సుమంత్ ను హీరోగా పెట్టి సినిమా తీయబొతున్నాడని టాక్. అయితే సుమంత్ తో పాటు మరో ఇద్దరు హీరోలు ఈ సినిమాకు అవసరం ఉండటంతో ఆ హీరోల వేటలో ప్రస్తుతం నాగార్జున ఉన్నాడు అనే వార్తలు వస్తున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: