‘ఈగ’ సినిమా తరువాత ఒక్క హిట్ కూడ లేకుండా పరస పరాజయాలతో సతమతవుతున్న నాని తన పరాజయాల రికార్డులను బ్రేక్ చేసుకోవడానికి తానే నిర్మాతగా మారి మరో ప్రయోగం చేసుకోబోతున్నాడు. ఇప్పుడు రీమేక్ ల యుగం నడుస్తూ ఉండటంతో నాని కూడా చాలామంది టాప్ హీరోలలాగే ఒక రీమేక్ సినిమా పై కన్ను వేసాడు. తమిళంలో విజయ్ సేతుపతి, తులసి, జయప్రకాష్, ఐశ్వర్య రాజేష్ కాంబినేషన్ లో అరుణ్ కుమార్ దర్శకత్వంలో తమిళంలో రూపొందిన 'పన్నయారుమ్ పద్మినియుమ్' సినిమా మంచి విజయాన్ని అందుకుంది. దాదాపు 3కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఈ చిత్రం 20కోట్లు వసూళ్లు సాధించింది. ఈ సినిమా రీమేక్ హక్కులను నానీ కైవసం చేసుకున్నాడు అనే వార్తలు వస్తున్నాయి.  ఈ సినిమాను నాని గతంలో తనకు హిట్ అందించిన 'పిల్లజమీందార్' దర్శకుడు అశోక్ దర్శకత్వంలో రూపొందిస్తాడు అనే వార్తలు ఫిలింనగర్ లో వినపడుతున్నాయి. నాని తన సన్నిహితులతో కలిసి ఈ సినిమాను వేగంగా తీస్తాడట. అయితే ఈ సినిమాలో హీరో పాత్రతో పాటు ప్రాధాన్యత ఉండే మరో జయప్రకాష్ పాత్రకు నటకిరీటి రాజేంద్రప్రసాద్ నటిస్తాడని ఫిలింనగర్ వర్గాల సమాచారం. అక్టోబర్ నుండి ప్రారంభం కాబోతున్న ఈ సినిమాలో ఒక ప్రముఖ హీరోయిన్ నాని పక్కన నటిస్తుందని టాక్. నానీ చేస్తున్న ఈ సాహసం విజయవంతం అయితే నాని కెరియర్ గాడిలో పడినట్లే అనుకోవాలి.  

మరింత సమాచారం తెలుసుకోండి: