టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలోకి ఎంట్రి ఇస్తున్న మరో మెగా హీరో సాయి ధరమ్ తేజ్. సాయి ధరమ్ తేజ్ ఏ ముహర్తాన ఫిల్మ్ ఇండస్ట్రీలోకి ఎంట్రి ఇచ్చాడో తెలియదు కాని, తను కష్టపడి చేస్తున్న మూవీలు అన్ని రిలీజ్ వరకూ వచ్చి ఆగిపోతున్నాయి. సాయి ధరమ్ తేజ్ నటించిన తొలి చిత్రం రేయ్ ఇప్పటి వరకూ రిలీజ్ కి నోచుకోలేదు. వై.వి.యస్ చౌదరి భారీ ఖర్చుతో నిర్మించిన ఈ చిత్రం పలు కారణాల వల్ల, పలు సార్లు మూవీ వాయిదా పడుకుంటూ వచ్చింది. అంతే కాకుండా మూవీ రేయ్ మూవీ ప్రమోషన్ కోసం కూడ వై.వి.యస్ చౌదరి బాగానే ఖర్చు పెట్టాడు. అలాగే మూవీని రిలీజ్ చేయటం కోసం చివరి ప్రయత్నాలు వరకూ చేశాడు. ప్రస్తుతం ఆ మూవీని పట్టించుకోవడం వై.వి.యస్ చౌదరి మానేశాడు. ఇదిలా ఉంటే సాయిధరమ్ తేజ్ నటించిన రెండవ చిత్రం ‘పిల్లా నువ్వులేని జీవితం’ కూడా షూటింగ్ పూర్తి చేసుకుంది. పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న ఈ సినిమా సెప్టెంబర్లో రిలీజ్ కావడానికి సిద్దమవుతోంది. ఈ మూవీకి సంబంధించిన రిలీజ్ పై కూడ కొద్దిగా అనుమానాలు ఉన్నాయంటూ టాలీవుడ్ లో టాక్స్ వినిపిస్తున్నాయి. ఎందుకంటే మొదటి మూవీకే బిజినెస్ కాలేదు. రెండు మూవీపై ఎంత వరకూ బిజినెస్ అవుతుందో అంటూ డిస్ట్రిబ్యూటర్స్ కొద్దిగా ఆలోచిస్తున్నారంట. ఇదిలా ఉంటే ఈ రెండు మూవీలు రిలీజ్ కాక ముందే సాయి ధరమ్ తేజ్ తన మూడవ సినిమాని సెప్టెంబర్ లో సెట్స్ పైకి తీసుకెళ్ళడానికి సిద్దమవుతున్నాడు. హరీష్ శంకర్ దర్శకత్వం వహించనున్న ఈ సినిమాని అల్లు అరవింద్, దిల్ రాజు కలిసి నిర్మించనున్నారు. దీనిపై త్వరలోనే ఓ అఫిషియల్ స్టేట్ మెంట్ రానుంది. మూవీలు రిలీజ్ కాక ముందే ఇలా వరుస సినిమాలు చేయటం, అవి రిలీజ్ వరకూ రాకపోవడం వంటి విషయాలు మెగా హీరోకి కొద్దిగా ఇబ్బందిగా మారిందట.

మరింత సమాచారం తెలుసుకోండి: