టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో భారీ చిత్రాల దర్శకుడు బెల్లంకొండ సురేష్ మరో భారీ చిత్రానికి సిద్ధంగా ఉన్నాడు. ఇదిలా ఉంటే బెల్లంకొండ సురేష్ తాజాగా తన తనయుడు శ్రీనివాస్ మూవీని గ్రాండ్ తెరకెక్కించడమే కాకుండా, అదే రేంజ్ లో రిలీజ్ చేశాడు. మూవీ రిలీజ్ అనంతరం అల్లుడుశీను మూవీకి కలెక్షన్స్ కూడా బాగానే వచ్చాయి. దీంతో బెల్లంకొండ శ్రీనివాస్ ఫిల్మ్ ఇండస్ట్రీలోకి ఎంట్రి ఇచ్చిన మొదటి మూవీ గ్రాండ్ సక్సెస్ ని సాధించడంతో, తండ్రి అయిన బెల్లంకొండ సురేష్ తెగ ఆనందపడిపోతున్నాడు. దీంతో తనే తన కొడుకు సెకెండ్ మూవీకి మరోసారి నిర్మాత అవతారం ఎత్తబోతున్నాడు. ఇప్పటికే సెకండ్ మూవీకి సంబంధించిన ప్రిప్రొడక్షన్ పనులు కూడ శరవేగంగా జరుగుతున్నాయి. తనయుడి మొదటి చిత్రంలో హీరోయిన్ గా స్టార్ గ్లామర్ బ్యూటీ సమంత నటించింది. సమంత నటించినందుకు గానూ, తన రెమ్యునరేషన్ కింద దాదాపు 5 కోట్ల రూపాయల విలువైన గెస్ట్ హౌజ్ ని తన పేర రాసి ఇచ్చినట్టు కథనాలు వినిపిస్తున్నాయి. ఇదే మూవీలో తమన్న ఐటెం సాంగ్ చేసింది. తమన్న కేవలం ఒక ఐటెం సాంగ్ చేసినందుకు దాదాపు యాభై లక్షలను రూపాయలను తీసుకుంది. శ్రీనివాస్ సరసన ఐటెం సాంగ్ చేసిన తమన్న, ఇప్పుడు శ్రీనివాస్ సెకండ్ మూవీ ఏకంగా హీరోయిన్ గా చేస్తుంది. అందుకు తమన్న గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందని సమాచారం. ఈ చిత్రాన్ని కూడా భారీ బడ్జెట్ తో నిర్మించడానికి బెల్లంకొండ సురేష్ సన్నాహాలు చేస్తున్నారు. బోయపాటి శ్రీను దర్శకత్వం వహించనున్న ఈ చిత్రానికి ప్రస్తుతం నటీనటులు ఎంపిక జరుగుతోందని తెలుస్తోంది. అయితే తమన్న ఇందులో హీరోయిన్ గాచేస్తున్నందుకు బెల్లంకొండ సురేష్ వద్ద ఉన్న మరో గెస్ట్ హౌజ్ ని తమన్న రాయించుకుంటుందోమో అని టాలీవుడ్ లో టాక్స్ వినిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: