టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో వరుస సక్సెస్ లతో దూసుకుపోతున్న హీరో అల్లుఅర్జున్. ప్రస్తుతం అల్లు అర్జున్ మార్కెట్ విపరీతంగా పెరిగింది. ఎందుకంటే అల్లుఅర్జున్ తీస్తున్న గత చిత్రాల సెలక్షన్స్ చాలా బాగుండటమే కాకుండా, బాక్సాపీస్ ని షేక్ చేస్తున్నాయి. దీంతో అల్లుఅర్జున్ మరో రెండు మూవీలతో ఇదే సక్సెస్ ని కొనసాగిస్తే కచ్ఛితంగా టాలీవుడ్ నెంబర్.1 పొజిషన్ చేరుకుటాడని అంటున్నారు. ఇదిలా ఉంటే తెలుగు హీరోలలో వారి బిజినెస్ ని ఎస్టాబ్లిష్ చేసుకుంటున్న హీరోలలోనూ అల్లుఅర్జున్ మొదటి వరుసలో ఉన్నాడు. ఇప్పటికే అల్లుఅర్జున్ కి మలయాళి మార్కెట్ లో బాగా డిమాండ్ ఉంది. అలాగే ఇప్పుడు తన అప్ కమింగ్ మూవీ ద్వారా కోలీవుడ్ మార్కెట్ ని షేక్ చేయటానికి సిద్ధంగా ఉన్నాడు. అందుకు తను నటిస్తున్న అప్ కమింగ్ త్రివిక్రమ్ మూవీ కాంబినేషన్ లో ఓ కోలీవుడ్ హీరో నటించనున్నాడు. అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తమ కొత్త సినిమా కోసం పక్కా ప్లాన్ రెడీ చేశారు. ఈ సినిమాను తెలుగుతో పాటు మలయాళం, తమిళ భాషలలో ఏకకాలంలో విడుదల చేయాలని భావిస్తున్నట్టు సమాచారం. ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్లు ఉంటారు. అలాగే కోలీవుడ్ కి చెందిన హీరోకి సైతం ఈ మూవీలో కీలక రోల్ ఇవ్వనున్నారని టాలీవుడ్ లో టాక్స్ వినిపిస్తున్నాయి. మొత్తానికి ఈసారి అల్లుఅర్జున్ తన మూవీలో కోలీవుడ్ లో పంజా దులపనున్నాడని అంటున్నారు. మొత్తానికి అల్లుఅర్జున్ అనుకున్నది సాదిస్తే, పేరు కి తగ్గట్టే మెగా హీరో అనిపించుకుంటాడు. త్రివిక్రమ్, అల్లుఅర్జున్ కాంబినేషన్ లో వస్తున్న ఈ మూవీలో సమంత మెయిన్ హీరోయిన్ గా ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: