అతిలోక సుందరి శ్రీదేవి టాప్ హీరోయిన్ కాక ముందు భారతీరాజా దర్శకత్వంలో నటించిన ‘ఎర్ర గులాబీలు’ సినిమాదాదాపు 35 సంవత్సరాల క్రిందట ఒక సంచలనం. ఒక యదార్ధ సంఘటనను ఆధారంగా చేసుకుని అప్పటి రోజులలోని టాప్ డైరెక్టర్ భారతీరాజా కమల్ హాసన్ చేత నెగిటివ్ పాత్ర చేయించి కమల్ కు సూపర్ హిట్ అందించాడు ఇప్పుడు ఆ సినిమాను రీమేక్ చేసేందుకు కోలీవుడ్‌లో ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. 1978లో ఈ సినిమా ‘సిగప్పు రోజాక్కల్’ పేరుతో కోలీవుడ్‌లో విడుదలైంది. ఇందులో శ్రీదేవిని అచ్చం గులాబీలా భారతీరాజా చూపించాడని అప్పట్లో అనుకునే వారు. ఈ సినిమా విడుదల అయి మూడు దశాబ్దాలు దాటినా ఈ ఫిల్మ్‌కి క్రేజ్ తగ్గలేదు.  లేటెస్ట్ గా భారతీరాజా కొడుకు మనోజ్ భారతి ఈ మూవీని రీమేక్ చేస్తున్నాడు. శ్రీదేవి చేసిన రోల్‌ని శృతి‌హాసన్ చేయబోతోందని కోలీవుడ్ మీడియా వార్తలు రాస్తోంది.ఈ సినిమాలో నటించి మెప్పించడానికి శృతి కొన్ని టిప్స్ శ్రీదేవి వద్ద తీసుకునీ ఉద్దేశంలో కూడ ఉందట. ఒకనాటి శ్రీదేవి కెరియర్ కు బ్రేక్ ఇచ్చిన ఈ సినిమా శృతి విషయంలో ఎటువంటి సక్సస్ ఇస్తుందో చూడాలి. కమల్ హీరోగా నటించిన అలనాటి ఈ సినిమాలో ఈరోజు కమంల్ కూతురు హీరోయిన్ గా నటించడం ఒక రికార్డు అనుకోవాలి.   

మరింత సమాచారం తెలుసుకోండి: