మంచి సినిమాల గురించి ప్రమోట్ చేయడమే కాదు సమాజంలోని అన్ని వర్గాల వారికి మంచి ఆలోచనలు షేర్ చేసుకునే విషయంలో ముందు వరుసలో ఉండే రాజమౌళి ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిన రైస్ బకెట్ ఛాలెంజ్ పై తన స్పందన తెలియచేసాడు. పాశ్చాత్యదేశాలలో ప్రస్తుతం ఒక ఫ్యాషన్ గా మారిపోయిన ఐస్ బకెట్ ఛాలెంజ్ అమెరికానుండి బాలీవుడ్ కు అక్కడ నుండి టాలీవుడ్ కు దిగుమతి అయి అనేకమంది సినిమా సెలెబ్రెటీల నుండి బుల్లితెర యాంకర్ల వరకు ఈ ఐస్ బక్కెట్ ఛాలెంజ్ ని వైరస్ గా పెంచేస్తున్న నేపధ్యంలో హైదరాబాద్ కు చెందిన మంజులత అనే మహిళ ఐస్ బక్కెట్ ఛాలెంజ్ కి పోటీగా రైస్ బక్కెట్ ఛాలెంజ్ విసిరి మరి కొంతమందిని ఈ పద్ధతిని అనుసరించగలరా అనే సవాల్ విసిరింది. పేదలకు ఒక బక్కెట్ నిండా రైస్ ను ఇచ్చి ఆదుకోమని చెప్పే ఈ కొత్త ఆలోచనతో ఎంతోమందికి ఆకలి తీర్చినట్లు అవుతుందని ఆమె భావన. ఇప్పటికే మీడియాలో మంచి ప్రచారం అందుకున్న ఈ ఆలోచనకు మన తెలుగు తెర జక్కన్న రాజమౌళి ఓటు వేయడమే కాకుండా తన సహకారాన్ని కూడ వెబ్ మీడియా సాక్షిగా ప్రకటించడంతో రాజమౌళిని అనుసరిస్తూ మన సెలెబ్రెటీలతో పాటు సామాన్యులు కూడ ఈ రైస్ బకెట్ ఛాలెంజ్ ని తీసుకుని ఎంతమంది పేదలకు సహాయ పడతారో చూడాలి.  

మరింత సమాచారం తెలుసుకోండి: