ప్రభుత్వాలను నడిపించే మంత్రులకు విదేశాలకు చెందిన ప్రభుత్వ అధినేతలకు మాత్రమే లభించే గార్డ్ ఆఫ్ హానర్ ఒక హీరోయిన్ కు ఇవ్వడం తీవ్ర వివాదాలలో చుట్టుకుంది. కర్నాటక రాష్ట్ర అధికారులకు సినిమాలు అంటే ఎంత వ్యామోహమో ఈ వ్యవహారం బయట పెట్టింది. బాలీవుడ్ బ్యూటీ నర్గీస్ ఫక్రి ఇటీవల మైసూరుకు వెళ్ళింది. అక్కడ బికినీ వేసుకుని ఒక ఛానల్ నిర్వహించిన వన్య మృగ సంరక్షణ కార్యక్రమానికి ప్రచారం చేస్తూ ఒక వన్య మృగ సంరక్షణ కేంద్రంలో ‘సేవ్ టైగర్’ కార్యక్రమంలో పాల్గొన్నది. అప్పటి వరకు అంతా సజావుగా జరిగినా ఈ హాట్ బ్యూటీకి ఆ వన్య మృగ సంరక్షణ కేంద్రంలోని సిబ్బంది గౌరవ వందనం అదే గార్డ్ ఆఫ్ హానర్ ఇవ్వడం తీవ్ర వివదాస్పదంగా మారింది.  ఈ విషయాన్ని ప్రముఖ కన్నడ పత్రిక వెలుగులోకి తీసుకు రావడంతో ఈ న్యూస్ వివాదంగా మారి ఈ గౌరవ వందన కార్యక్రమాన్ని నిర్వర్తించిన అటవీ అధికారులు సిబ్బంది పై ప్రభుత్వం చర్యలకు ఆదేసించింది అని టాక్. ఏమైనా ఒక హాట్ బ్యూటీకి గౌరవ వందనం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారి కన్నడ మీడియాను షేక్ చేస్తోందని వార్తలు వస్తున్నాయి.  

మరింత సమాచారం తెలుసుకోండి: