ఎంతటి టాప్ హీరో అయినా తమకు ఘోర పరాజయాన్ని ఇచ్చిన సూపర్ ఫ్లాప్ సినిమాల గురించి మాట్లాడరు. అయితే దీనికి భిన్నంగా తన పుట్టినరోజు సందర్భంగా నాగార్జున మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన ‘భాయ్’ సినిమా పై తానే సెటైర్లు వేసుకోవడం అందర్నీ ఆశ్చర్య పరిచింది.  ఏ హీరోకి అయినా జయాపజయాలు ఉంటాయని అయితే ‘భాయ్’ సినిమా పరాజయంతో తానేమిటో తనకు తెలిసి వచ్చిందని అంటూ ఆ సినిమా తనకు చెంప దెబ్బ కొట్టి తన మైండ్ సెట్ ను మార్చి వేసిందని సంచలన వ్యాఖ్యలు చేసాడు నాగార్జున. ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ సూపర్ సక్సస్ తో తనకు ఇమేజ్ బాగా పెరిగిపోయి చిన్న పిల్లలు తాను బయటకు వెళ్ళినప్పుడు ‘టివి అంకుల్’ అని పిలవడం తనకు ఆనందం కలిగిస్తున్నా మరో విధంగా బుల్లి తెరకే పరిమితం అయిపోతానా? అనే భయం కలుగు తోందని అందుకే వచ్చే నెలలో తాను ద్విపాత్రాభినయం చేయబోతున్న ఒక వెరైటీ సినిమాను కళ్యాణ్ అనే కొత్త దర్శకుడితో చేయబోతున్నానని చెప్పాడు నాగ్. ఈ సినిమాలో ‘మనం’ మించిన ట్విస్ట్ లు ఉంటాయి అని చెపుతున్న నాగార్జున తనతో ఈ సినిమాలో రమ్య కృష్ణ నటిస్తుందని అదే విధంగా మరొక గ్లామర్ హీరోయిన్ గురించి అన్వేషణ జరుగుతొంది అని చెప్పాడు నాగార్జున. అనుభందాలు ఆత్మీయతలు గురించి తనకు చెరగని ముద్రవేసిన ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ జ్ఞాపకాలు మాత్రం తనను జీవితాంతం వెంటాడుతూనే ఉంటాయి అని నాగార్జున ఎమోషనల్ గా చెప్పాడు.  

మరింత సమాచారం తెలుసుకోండి: