బాలకృష్ణ నటిస్తున్న లేటెస్ట్ సినిమాలో కోటి రూపాయలకు పైగా పారితోషికం తీసుకుని మంచి జోష్ మీద ఉన్న త్రిష కంట బాలయ్య కంట కన్నీరు పెట్టించాడు. అయితే నందమూరి సిoహం త్రిషను షూటింగ్ సమయంలో ఎదో అని ఏడిపించడం కాదు ఇది వేరే విషయం. ప్రస్తుతం జరుగుతున్న బాలయ్య, త్రిషల సినిమా షూటింగ్ విరామ సమయంలో త్రిషతో బాలయ్య పిచ్చాపాటి మాట్లాడుతూ నటి సావిత్రి జీవితం గురించి చెప్పాడట. తమిళం తెలుగు భాషల్లో ఎన్నో ఆణిముత్యాల్లాంటి చిత్రాల్లో గొప్ప నటనను ప్రదర్శించి అగ్ర నటీమణిగాఒక వెలుగు వెలిగిన సావిత్రి అప్పట్లోనే లక్షలు ఆర్జించి, ఆస్తులు పెంచుకున్న విషయంతో పాటు చివరి దశలో అన్నీ పోగొట్టుకుని అవకాశాలు లేక అనారోగ్యంతో కోమాలోకి వెళ్లి పోవడం ఆ తరువాత కోమాలోనే ఆమె చనిపోవడం విషయాలను యదార్ధంగా బాలయ్య వివరిస్తే షాక్ కు గురైన త్రిష కంట తడి పెట్టిందట.  అయితే ఆ సినిమా షూటింగ్ స్పాట్లో త్రిష ఎందుకు ఎడుస్తోందో అర్ధంకాక ఇబ్బంది పడ్డ యూనిట్ సభ్యులు అసలు విషయం తెలిసి తేలిక పడ్డారట. మహానటి సావిత్రి జీవితం త్రిషకు తెలిసింది కాబట్టి త్రిష మరింత జాగ్రత్త పడి ముందు చూపుతో ఇంకా నిర్మాతల దగ్గర ఎక్కువ పిండేస్తుందేమో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: