ప్రస్తుతం సౌత్ ఇండియా ఫిల్మ్ ఇండస్ట్రీ హీరోయిన్స్ లో టాప్ హీరోయిన్ గా చెలామణి అవుతున్న వాళ్ళలో శృతిహాసన్ ఒకరు. శృతిహాసన్ ఇటు సౌత్ లోనూ, అటు బాలీవుడ్ లోనూ ఫుల్ బిజి షెడ్యూల్ తో మూవీలను చేస్తుంది. ఇదిలా ఉంటే తను తాజాగా నటించిన ఓ తమిళ్ చిత్రం పూజై. దీనిని తెలుగులో ‘పూజ’ పేరుతో అనువదిస్తున్నారు. ఈ సినిమాలో శృతి ఒక పాట పాడింది. రెండు భాషలలోను ఆమె గొంతు వినిపించబోతుంది, అంతే కాదు తన పాత్రకు తానే స్వయంగా డబ్బింగ్ చెప్పనుండం విశేషం. దీపావళి కానుకగా ‘పూజ’ను విడుదల చేస్తున్నట్టు హీరో, నిర్మాత అయిన విశాల్ వెల్లడించారు. విశాల్ సరసన శృతిహాసన్ మొదటి సారిగా నటించడం, అలాగే తమిళ్ మార్కెట్ లో ఈ మూవీపై భారీ ప్రమోషన్స్ ఇవ్వడం వంటివి చూస్తుంటే ఈ మూవీలో శృతిహాసన్ , విశాల్ ల మధ్య కొన్ని రొమాంటిక్ సీన్స్ సైతం ఉన్నాయని అంటున్నారు. ఇదిలా ఉంటే శృతిహాసన్ తెలుగులో ఇప్పటివరకు 7 సినిమాలో నటించినప్పటికీ, తొలిసారిగా డబ్బింగ్ డబ్బింగ్ చెప్పడం ఇదే మొదటిసారి. తను ఈ మూవీకి డబ్బింగ్ చెప్పడం కోసం ఏకంగా దాదాపు 8 లక్షల రూపాయలను తీసుకుంది. ఒక డబ్బింగ్ కోసం ఈ రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకోవడంపై శృతిహాసన్ హాట్ టాపిక్ గా మారింది. ‘సింగం’, ‘యముడు’ సినిమాల దర్శకుడు హరి దర్శకత్వంలో ‘పూజై’ మూవీ తెరకెక్కింది. హై ఓల్టెజ్ యాక్టన్ తో ఈ మూవీ ఉంటుందని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: