మహేష్ బాబు అభిమానులు ఎంతో ఆశగా ఎదురుచూసిన 'ఆగడు' మూవీ ఆడియో లాంచ్ కు మిల్కీ బ్యూటీ తమన్నా రాకపోవడం మహేష్ అభిమానులకు షాకింగ్ గా మారింది. అంతే కాదు తమన్నా మహేష్ పై అలిగింది అని ఈ మధ్య వచ్చిన వార్తలకు మిల్కీ బ్యూటీ ఈ ఫంక్షన్ కు రాకపోవడంమరింత బలాన్ని చేకూర్చింది. నిన్న సాయంత్రం భాగ్యనగరం శిల్పకళా వేదిక పై అట్టహాసంగ జరిగిన ‘ఆగడు’ ఆడియో లాంచ్ లో మహేష్ బాబు, నమ్రతా శిరోద్కర్, కృష్ణ, విజయ నిర్మల, బ్రహ్మానందం, 'ఆగడు' డైరెక్టర్ శ్రీనువైట్ల, సుకుమార్, కొరటాల శివ,శ్యామ్ ప్రసాద్ రెడ్డి, దిల్ రాజు వంటి సినీ ప్రముఖులు చాలామంది వచ్చినా ఈ ఆడియో ఫన్క్షన్న్ కు తమన్నా లేని కొరత స్పష్టంగా కనిపించింది.  ప్రముఖ దర్శకుడు శంకర్ కూడా ఈ ఫంక్షన్‌ కు అతిధిగా వచ్చినా మహేష్ అభిమానులు తమన్నా గురించే మాట్లాడుకోవడం కనిపించింది. ఈ సినిమా హీరోయిన్ రాకపోవడం వల్లో లేక ప్లానింగ్ లోపించడం వల్లో తెలీదుకానీ ఈ ఫంక్షన్ తాము ఆశించినంత బాగా రాలేదని మహేష్ అభిమానులే చెప్పుకోవడం వినిపించింది. నిన్న ఆడియో విడుదల సందర్భంగా విడుదల చేయబడ్డ ట్రైలర్ లో మహేష్ బాబు పేల్చిన మరో పంచ్ డైలాగ్ వదిలారు. ఈ ట్రైలర్ లో విలన్‌ హీరోని ఉద్దేశించి, ‘వీడ్ని ముక్కలు ముక్కలుగా’ అని అంటుoటే మధ్యలోనే మహేష్ అందుకుని విలన్‌ని ఉద్దేశించి ‘కాకులకి గద్దలకి వేసెయ్యాలా అప్‌ డేట్‌ అవరేంట్రా’ అని అంటాడు. ఈ డైలాగులు మహేష్ అభిమానులకు బాగా నచ్చినా ‘ఆగడు’ సినిమాలో పంచ్ డైలాగుల హడావిడి మరీ ఎక్కువై అసలు కధ మరుగున పడిపోతుందా అనే అనుమానం కూడ చాలామందికి అనిపించింది. ఏమైనా ‘ఆగడు’ పాటలు అంత అద్భుతం కాదు అనే మాటలు వినిపిస్తున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: