టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు తనయుడు గౌతమ్ కృష్ణ తన పుట్టినరోజును తన తండ్రితో మొన్న ఆనందంగా జరుపుకున్నాడు. ఏదైనా స్పెషల్ అకేషన్ ఉంటే తప్పించి అను నిత్యం సందడి చేయని మహేష్ తన కొడుకు పుట్టినరోజు సందర్భంగా తన ట్విటర్ లో పెట్టిన ట్విట్ అందర్నీ ఆశ్చర్య పరిచింది ‘నా కొడుకు ఈ రోజుతో 8వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాడు. మీ ప్రేమ, ఆశీర్వాదాలు చూపుతున్నందుకు ధాంక్స్.  ‘ఆగడు’ సినిమాలోని ఆడియో ట్రాక్స్‌లో ‘భేల్‌పురి' సాంగ్ గౌతమ్ ఫేవరెట్ అయిపోయింది. మళ్లీ మళ్లీ అదే పాట వింటూ చాలా ఎంజాయ్ చేస్తూ అదే పాటను కావాలి అంటున్నాడు. థమన్‌కు థాంక్స్' అంటూ ట్వీట్ చేసాడు మహేష్.  గతవారం విడుదలైన ‘ఆగడు’ పాటలకు తన అభిమానులలోనే మిశ్రమ స్పందన రావడంతో ‘ఆగడు’ ఆడియోకు మరింత క్రేజ్ పెంచడానికి మహేష్ తన కొడుకు గౌతమ్ ను అడ్డు పెట్టుకుని ఈ కొత్త టెక్నిక్ ఉపయోగిస్తున్నాడు అనే వార్తలు కూడ ఉన్నాయి. మహేష్ కెరియర్ కు ఎంతో ముఖ్యంగా మారిన ‘ఆగడు’ సక్సస్ గురించి మహేష్ ఎంత టెన్షన్ పడుతున్నాడో ఈ ట్విట్ ద్వారా తెలుస్తోందని కొoదరు విమర్శలు కూడ అప్పుడే మొదలు పెట్టేసారు. ప్రస్తుతం తమన్నా లక్ తన సినిమాల విషయంలో కలిసి రాకపోతున్న నేపధ్యంలో ‘ఆగడు’ పాటల డివైడ్ టాక్ తో పాటు తమన్నా భయం కూడ మహేష్ అభిమానులను విపరీతంగా భయ పెడుతోంది అనే వార్తలు వస్తున్నాయి. ఒకే నెలలో విడుదల అవుతున్న అనేక భారీ సినిమాల మధ్య వస్తున్న ఆగడు మొదటి ఆట నుండి పాజిటివ్ టాక్ తెచ్చుకోకపోతే మహేష్ ఆశలను ‘ఆగడు’ నెరవేర్చలేదు.  

మరింత సమాచారం తెలుసుకోండి: