మన జీవితాలలో ఎంచుకున్న కెరియర్ బాగుండనప్పుడు, ఏదైనా జరగకూడనిది జరిగినప్పుడు ఖంగారు పడుతూ జాతక దోష నివారణకు పూజలు చేస్తారు. కానీ టాలీవుడ్ కోలీవుడ్ లలో భారీ సినిమాలు చేస్తూ నెంబర్ వన్ హీరోయిన్ గా వెలిగి పోతున్న అనుష్క లేటెస్ట్ గా పూజలు చేసింది. అయితే ఆపూజలు ఆమెకోసంకాదు, ఆమె నటిస్తున్న ‘రుద్రమదేవి’ కోసం తెలుగు, తమిళం భాషలలో భారీ ఎత్తున రూపొందుతున్నఈ చారిత్రక సినిమా షూటింగ్ ఈ మధ్యనే పూర్తి అయింది. ఈ సినిమా సహజత్వం కోసం ఖరీదు గల బంగారు నగలతో అనుష్క నటించిన విషయం తెలిసిందే. ఆనగలు షూటింగ్ లొకేషన్లో తస్కరణకు గురై ఇప్పటి వరకు దొరకక పోవడం ఈ సినిమాకు కీడు అని కొందరు జ్యోతిష్కులు అనుష్కకు సూచించడంతో కలత పడిన అనుష్క ఈ సినిమా విడుదలకు మరియు విజయానికి ఎటువంటి అడ్డంకులు కలగకూడదని వరంగల్ లోని ఒక ప్రముఖ ఆలయంలో అమ్మవారికి అనుష్క పూజలు చేసింది అనే వార్తలు వస్తున్నాయి. గుణశేఖర్ తన ఆస్తులు అన్ని తాకట్టు పెట్టి తీసిన ఈసినిమా విజయం అటు గుణశేఖర్ తో పాటు నటిగా తన సత్తా చాటడానికి అనుష్కకు కుడా ముఖ్య మైనదిగా మారడంతో అనుష్క పూజలు ఎంతవరకు కలిసి వస్తాయో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: