కొన్నికొన్ని విషయాలను పోల్చుకుంటూ మాట్లాడటం వినేవారికి చాల అతిగా అనిపిస్తుంది. ఇటువంటి సంఘటన మొన్న గోపీచంద్, రకుల్‌ప్రీత్ సింగ్ జంటగా తెరకెక్కుతున్న ‘లౌక్యం’ మూవీ ఆడియో వేడుకలో జరిగింది. ఈ ఫంక్షన్ లో మాట్లాడిన హీరో గోపీచంద్ తన ‘లౌక్యం’ సినిమా 'అత్తారింటికి దారేది' లాగే బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని మితిమీరిన లౌక్యం తో మాట్లాడటం అందర్నీ ఆశ్చర్య పరచడమే కాకుండా గోపీచంద్ కు ఇంత పెద్ద కోరికలు ఉన్నాయా అని అనిపించేడట్లుగా చేసింది.  గోపీచంద్ మాటలు విన్న విమర్శకులు మాత్రం పవన్ ‘ఆత్తారిల్లు’ సినిమాకు గోపీచoద్ ‘లౌక్యం’ కు ఒక పోలిక ఉంది అంటూ సెటైర్లు వేస్తున్నారు. 'అత్తారింటికి'లో ఐటం గాళ్‌గా కనిపించిన హంసా నందిని ఈ సినిమాలోనూ ఓ ఐటంసాంగ్ చేసింది. హంసనందిని ఐటంసాంగ్ ‘లౌక్యం’ మూవీకి ఓ స్పెషల్ హైలైట్ కానుందని టాక్. అందువలెనే కాబోలు గోపీచoద్ కు 'అత్తారిల్లు' గుర్తుకు వచ్చింది అని అంటున్నారు. హంసనందిని స్పెషల్ సాంగ్ చేసిన సినిమాలు అన్నీ బ్లాక్ బస్టర్ కావడంతో సహజంగానే గోపీ చంద్ కు ఈ కోరిక పుట్టి భారీ సినిమాల మధ్య తన ‘లౌక్యం’ కూడ విడుదల చేస్తూ టాలీవుడ్ కు షాక్ ఇస్తున్నాడు.   

మరింత సమాచారం తెలుసుకోండి: