రేపు విడుదల అవుతున్న ‘ఆగడు’ తాను కోరుకున్న విధంగా బ్లాక్ బస్టర్ హిట్ కావాలి అంటూ అజ్మేర్ దర్గాకి వెళ్లి ప్రార్ధనలు చేస్తూ రేపటి ఉదయం కోసం టెన్షన్ గా ఎదురు చూస్తున్న ప్రిన్స్ మహేష్ బాబుకు కోలీవుడ్ టాప్ హీరో సూర్య విసిరిన ఛాలెంజ్ ప్రిన్స్ కు తలనొప్పిగా మారింది అనే వార్తలు వస్తున్నాయి. ఏఎల్ఎస్ డిసీజ్ కాజ్ కోసం మొదలుపెట్టిన ఐస్ బకెట్ ఛాలెంజ్ మరిన్ని కొత్త పుంతలు తొక్కి ఐస్ బకెట్‌ రైస్ బకెట్ ఛాలెంజ్ గా మారిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆ ఛాలెంజ్ కి మరో కొత్త రూపంగా 'మై ట్రీ ఛాలెంజ్' ప్రారంభమైంది. విదేశాలలో మొదలైన ఈ ఛాలెంజ్ ఇప్పుడు సౌతిండియన్ స్టార్ మమ్ముట్టి ద్వారా మన దక్షిణ భారతదేశ సినిమా రంగానికి పాకింది. ఐస్ బకెట్ ఛాలెంజ్‌కి బదులు ఓ చెట్టు నాటి ప్రపంచ పర్యావరణానికి తోడ్పడుదాం అని మమ్ముట్టి 'మై ట్రీ ఛాలెంజ్'ని స్వీకరించాడు. అంతేకాదు సూర్య, విజయ్, షారుఖ్ ఖాన్ వంటి ప్రముఖ హీరోలను ఈ ఛాలెంజ్ స్వీకరించాల్సిందిగా నామినేట్ చేశాడు. మమ్ముట్టి నుండి ఛాలెంజ్‌ని స్వీకరించిన విజయ్ ఆ ప్రకారమే ఓ 25వేల మొక్కలు నాటేందుకు ముందుకు వచ్చాడు. అయితే ఇదే ఛాలెంజ్ ని స్వీకరించిన సూర్య తన ఇంటిలో ఓకే కొబ్బరి చెట్టును నాటడమే కాకుండా ఈ ఛాలెంజ్ ని కొనసాగించగలరా? అంటూ మహేష్, సుదీప్, అమీర్ ఖాన్ లకు సవాల్ విసిరాడు. అదేవిధంగా మహేష్, సుదీప్ అభిమానులు కూడ ఈ ఛాలెంజ్ ని స్వీకరించగలరా? అంటూ సవాల్ విసరడం సంచలనంగా మారింది.  అయితే అసలే ‘ఆగడు’ టెన్షన్ లో ఉన్న మహేష్ కు అతడి అభిమానులకు సూర్య విసిరిన ఛాలెంజ్ ఆశక్తి దాయకంగా ఉన్నా మహేష్ కెరియర్ ను ప్రభావితం చేసే ‘ఆగడు’ రిజల్ట్ ముందు సూర్య విసిరిన ఛాలెంజ్ ని తీసుకుని ప్రిన్స్ మహేష్ మరి కొందరు హీరోలకు సవాల్ విసరగలుగుతాడా? అనే విషయం రేపటి ‘ఆగడు’ రిజల్ట్ పై ఆధారపడి ఉంటుంది అంటూ ఫిలింనగర్ లో సెటైర్లు వినిపిస్తున్నాయి.  

మరింత సమాచారం తెలుసుకోండి: