మహేష్ కే కాదు శ్రీనువైట్లకు కూడ ‘ఆగడు’ నిద్ర లేకుండా చేస్తోంది. దర్శకుడు శ్రీనువైట్లకు ఒక సెంటిమెంట్ ఉంది. తన ప్రతిసినిమా విడుదలకు ముందు సింహాచలంలోని శ్రీ వరాహలక్ష్మీ నృసింహస్వామి ఆలయానికి వస్తే ఆ సినిమా సక్సస్ కు ఎదురులేదు అని శ్రీనువైట్ల నమ్మకం. ఆ నమ్మకంతోనే నిన్న శ్రీనువైట్ల రేపు విడుదల కాబోతున్న ‘ఆగడు’ సూపర్ హిట్ కావాలని నిష్టగా పూజలు చేసి అంతరాలయంలోని కప్పస్తంభాన్ని ఆలింగనం చేసుకుని అంతారాలయంలో శాస్త్రోత్తంగా పూజను నిర్వహించాడు అనే వార్తలు వస్తున్నాయి. అంతేకాదు గోదాదేవికి కుంకుమార్చన కూడ చేశాడు శ్రీనువైట్ల. ఈ సందర్భంగా తనను కలిసిన మీడియాతో మాట్లాడుతూ తాను సింహగిరికి వచ్చినప్పుడల్లా కొత్త ఎనర్జీ వస్తుందని ఆ ఎనర్జీ తనతో ఇంకా మంచి సినిమాలు తీయించేలా శక్తి ఇస్తుందని చెపుతూ తనకు సెంటిమెంట్ రీత్యా శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి తనకు ఇష్టదైవమని ఆయన దీవెనలు ‘ఆగడు’ కు లభించడంతో ఈ సినిమా సూపర్ హిట్ ఖయాం అని అన్నాడు శ్రీనువైట్ల. ఆగడు మహేష్ బాబు స్థాయిని మరింత పెంచే సినిమాగా మారుతుందని అంటూ త్వరలోనే రామ్ చరణ్ తో తీయబోతున్న సినిమాకు రెడీ అవుతున్నట్లు ప్రకటించాడు శ్రీనువైట్ల. ఆలయం దగ్గర శ్రీనువైట్లను చూడగానే భక్తులు శ్రీనువైట్ల చుట్టుముట్టి ఫోటోలు తీయించుకోవడమే కాకుండా శ్రీనువైట్ల ఆటోగ్రాఫ్‌ల కోసం పరుగులు తీసారు. మహేష్ దర్గాల చుట్టూ దర్శకుడు శ్రీనువైట్ల ఆలయాల చుట్టూ తిరుగుతూ మొక్కుకుంటున్న మొక్కులు ఎటువంటి ఫలితాన్ని ఇస్తాయో రేపు తేలిపోతుంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: