‘ఆగడు’ హడావిడి అయిపోవడంతో ఇక మెగా అభిమానుల హడావిడికి కౌంట్ డౌన్ ప్రారంభమైంది. ఇప్పుడు అందరి దృష్టి చరణ్ నటిస్తున్న ‘గోవిందుడు అందరివాడేలే’ పైనే ఉంది. రామ్ చరణ్ కు యూత్ లో ఉన్న క్రేజ్ ను దృష్టిలో పెట్టుకుని ‘గోవిందుడు’ సినిమా నిర్మాత బండ్ల గణేష్, రామ్ చరణ్ ఈ సినిమా కోసం వాడిన హార్లే డివిడ్ సన్ బైక్ ను వేలం వేయబోతున్నాడు అనే వార్తలు వస్తున్నాయి.  రామ్ చరణ్ కోసం ప్రత్యేకంగా డిజైన్ చేయించిన ఈ బైక్ ఖరీదు 30 లక్షలు అని అంటున్నారు. ఈ సినిమా విడుదలైన తర్వాత ఈ బైక్ వేలం కార్యక్రమం ప్రారంభం అవుతుందని అంటున్నారు. మహేష్ ‘ఆగడు’ కు మిశ్రమ స్పందన రావడంతో దసరాకు రాబోతున్న ‘గోవిందుడు అందరివాడేలే’ సినిమా పై అంచనాలు పెరగడమే కాకుండా ఈ సినిమా గ్యారింటి హిట్ సాధిస్తుందని ఈ సినిమాను కొనుక్కున్న బయ్యర్లు కూడా మంచి అంచనాల పై ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి.  అదేవిధంగా ఈ సినిమా పబ్లిసిటీ కూడ వెరైటీగా చేసి అటు చరణ్ అభిమానులనే కాకుండా ఫ్యామిలీ ప్రేక్షకులను కూడ ధియేటర్లకు రప్పించడానికి ఈ సినిమా యూనిట్ ఇప్పటి నుంచే పధకాలు రచిస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. చరణ్ పై చిత్రీకరించిన ఒక స్పెషల్ సాంగ్ ను ‘గోవిందుడు’ విడుదల అయిన రెండు వారాల తరువాత ఈ సినిమాకు యాడ్ చేసి మెగా అభిమానులకు సర్ ప్రైజ్ చేయడానికి బండ్ల గణేష్ మెగా ప్లాన్ రచించినట్లుగా వార్తలు వస్తున్నాయి.  

మరింత సమాచారం తెలుసుకోండి: