గతవారం చెన్నైలో భారీ ఎత్తున జరిగిన ‘ఐ’ ఆడియో ఫంక్షన్ స్థాయిలోనే భాగ్యనగరంలో కూడా దసరా పండుగ జరుగుతున్న తేదీలలో అక్టోబర్ 2న టాలీవుడ్ మార్కెట్ ను టార్గెట్ చేస్తూ దర్శకుడు శంకర్ నేతృత్వంలో ‘ఐ’ ఆడియో వేడుకను హైదరాబాద్ లో నిర్వహించడానికి భారీ ఏర్పాట్లు చేస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.  చెన్నైలో జరిగిన ‘ఐ’ ఆడియో వేడుకకు ప్రముఖ హాలీవుడ్ నటుడు ఆర్నాల్డ్ ముఖ్య అతిధిగా వచ్చి సందడి చేస్తే హైదరాబాద్ లో జరిగే ‘ఐ’ ఆడియో వేడుకకు ప్రముఖ హాలీవుడ్ స్టార్ జాకీచాన్ ముఖ్య అతిధిగా సందడి చేయబోతున్నాడని టాక్.  చెన్నైలో ఈ సినిమా హీరో విక్రమ్ మానవ మృగ ఆకారంలో వేదిక పై హీరోయిన్ అమీజాక్సన్ తో డాన్స్ చేసినట్లే ఇక్కడ కూడా అదే స్థాయిలో విక్రమ్ తన విశ్వరుపాన్ని చూపెట్టబోతున్నాడనే వార్తలు ఈ సినిమా యూనిట్ నుండి అందుతున్నాయి. కోలీవుడ్ లోనే కాకుండా టాలీవుడ్ లోనే కూడ భారీ కలెక్షన్స్ పై కన్నేసిన ‘ఐ’ దీపావళికి విడుదలై తన సత్తాను చాటితే మళ్ళీ టాలీవుడ్ లో డబ్బింగ్ సినిమాల హవా ప్రారంభం అవుతుంది. ఈ సినిమాను ప్రపంచ వ్యాప్తంగా మొదట్లో అనుకున్న 15 వేల ధియేటర్లకు బదులు దియేటర్ల సంఖ్యను దాదాపు 20 వేల వరకు పెంచి ఒక తమిళ సినిమాకు హాలీవుడ్ స్థాయిలో ఓపెనింగ్స్ రాబట్టుదామన్న శంకర్ ప్రయత్నం విజయవంతం అయితే దక్షిణాది సినిమా మార్కెట్ అంతర్జాతీయ స్థాయికి చేరుకున్నట్లే.   

మరింత సమాచారం తెలుసుకోండి: