రామ్ చరణ్ ‘గోవిందుడు అందరి వాడేలే’ విడుదల తరువాత గ్యాప్ ఇవ్వకుండా శ్రీనువైట్ల దర్శకత్యంలో సినిమా చేయడానికి కమిట్ అయ్యాడు అన్న విషయం తెలిసిందే. దీనికి సంబం దించిన స్టొరీ లైన్ విషయంలో కుడా చరణ్ శ్రీనువైట్లకు తన అంగీకారాన్ని తెలియచేసాడు. అయితే ‘ఆగడు’ రిజల్ట్ బయటకు వచ్చిన తరువాత మెగా కాంపౌండ్ శ్రీనువైట్లను తమ వద్దకు పిలిపించుకోవడమే కాకుండా మరొకసారి ఈ సినిమా కధ పై పోస్టుమార్టమ్ మొదలు పెట్టింది అనే వార్తలు వస్తున్నాయి. కధ విషయంలో మహేష్, జూనియర్ లను ఒప్పించినంత సులువుగా శ్రీను వైట్ల మెగా కాంపౌండ్ ను ముఖ్యంగా చిరంజీవి చరణ్ లను ఒప్పించలేడని అందువల్ల చరణ్ శ్రీనువైట్లల సినిమా కధ విషయంలో చాల మార్పులు చేర్పులు జరిగే అవకాసం ఉంది అంటూ ప్రచారం ఊపు అందుకుంది. ప్రస్తుత పరిస్థుతులలో రెండు వర్గాలుగా విడిపోయిన టాలీవుడ్ పరిశ్రమను ‘ఆగడు’ పరాజయం మహేష్ ను సపోర్టు చేసే ఒక ప్రముఖ వర్గాన్ని తీవ్ర నిరాశకు లోనుచేసింది అనే వార్తలు వస్తున్నాయి. దసరాకు విడుదల కాబోతున్న ‘గోవిందుడు అందరివాడేలే’ సినిమా సూపర్ హిట్ సాధిస్తే ఒకే సంవత్సరంలో రెండుసార్లు మహేష్ పై ఆధిపత్యాన్ని కొనసాగించిన చరణ్ రికార్డ్ మెగా ఫ్యామిలీకి జోష్ ను ఇస్తే మహేష్ ను సపోర్ట్ చేస్తున్న మరో వర్గానికి తీవ్ర నిరాశను కలగచేయడమే కాకుండా టాలీవుడ్ పై మెగాకుటుంబ ఆధిపత్యం మరింత పెరిగి పోతుంది అనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి.    

మరింత సమాచారం తెలుసుకోండి: