మెగా హీరో రామ్ చరణ్ తేజ్ నటించిన గోవిందుడు అందరివాడేలే మూవీ అక్టోబర్ 1న ధియోటర్స్ ని హిట్ చేయబోతుంది. ఇదిలా ఉంటే ఈ మూవీకి సంబంధించిన బిజినెస్ భారీగా జరిగింది. అలాగే మూవీ ఓపెనింగ్ డే కలెక్సన్స్ పైనా అందరిలోనూ ఆసక్తిని కలిగిస్తుంది. ఇదిలా ఉంటే తాజాగా గోవిందుడు అందరివాడే మూవీకి సంబంధించిన శాటిలైట్ బిజినెస్ కూడ భారీ స్థాయిలో అమ్ముడుపోయింది. గోవిందుడు అందరివాడేలే సినిమా గురించి చాలా పాజిటీవ్ న్యూస్ లు వినిపిస్తున్నాయి. నిర్మాత బండ్ల గణేష్ సినిమాపై ఎంతో ధీమా వ్యక్తం చేస్తున్నాడు. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్ర శాటిలైట్ హక్కుల కోసం రెండు ఛానల్స్ పోటాపోటీ పడ్డట్టు తెలుస్తుంది. జెమినీ టి.వి దాదాపు 9కోట్లకు సొంతం చేసుకునట్టు సమాచారం. 8 కోట్ల రూపాయలతో మొదలయిన గోవిందుడు అందరివాడేలే మూవీ శాటిలైట్ బిజినెస్, చివరకు 9 కోట్ల రూపాయలతో డీల్ క్లోజ్ అయింది. మా టివి సంస్థ ఈ మూవీకి 8.30 కోట్ల రూపాయలనుఇవ్వటానికి సిద్ధ పడగా, జెమిని ఏకంగా 9 కోట్ల రూపాయలతో మూవీని కైవసం చేసుకుంది. అంతే కాకుండా మూవీకి సంబంధించిన స్పెషల్ ఇంటర్వూలని సైతం ఆ ఛానల్ ఫ్లాన్ చేసుకుంటుంది. కాజల్ హీరోయిన్. ప్రకాష్ రాజ్, శ్రీకాంత్, జయసుధ, కమిలినీ ముఖర్జీ నటిస్తున్న ఈ సినిమా ఈ బుధవారం విడుదలకానుంది. ఈ మూవీపై హీరో రామ్ చరణ్ తేజ్, దర్శకుడు క్రిష్ణవంశీ అలాగే నిర్మాత బండ్ల గణేష్ భారీ ఆశలను పెట్టుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: