టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో అతి తక్కువ కాలంలోనే స్టార్ డం స్టేటస్ ని సంపాదించిన హీరోయిన్ అంజలి. ఒక్కసారిగా స్టార్ హీరోల సరసన వరుస ఆఫర్స్ ని చేజిక్కించుకుంటూ, నెంబర్ వన్ పొజిషన్ రేసులో నిలుచుంది. ఇదిలా ఉంటే అనూహ్యంగా తన కెరీర్ వివాదాల చుట్టూ తిరిగింది. ఎంత త్వరగా స్టార్ డం వచ్చిందో అంతే త్వరగా అవకాశాలని కోల్పోయింది. అందుకు కారణం తన వ్యక్తిగత జీవితం వివాదాలతో ముడిపడి ఉండటమే. అయితే తాజాగా అంజలి తన పెళ్ళికి సంబంధించిన వ్యవహారంపై స్పంధించింది. ఈ మధ్య కాలంలో అంజలి ఓ యువ నటుడితో ప్రేమయణం నడుతున్నట్టుగా కోలీవుడ్ లో కథనాలు వినిపిస్తున్నాయి. అయితే ఆ వార్తల్లో నిజం లేదని తెలుపుతూ, అలాగే తన పెళ్ళికి అప్పుడే తొందరేముంది అంటూ చెప్పుకొచ్చింది. అంగాడి తెరు చిత్రంతో కోలీవుడ్‌లో కథానాయికగా గుర్తింపు పొందిన అంజలి అచ్చ తెలుగు అమ్మాయన్నది గమనార్హం. ఆ తరువాత వరుసగా ఎంగేయుం ఎప్పోదుం, కలగలప్పు వంటి చిత్రాల్లో నటించి సక్సెస్‌ఫుల్ హీరోయిన్‌గా ముద్ర వేసుకున్నారు. సరిగ్గా అలాంటి సమయంలో తన పినతల్లి భారతీ దేవితో విభేదాలు, దర్శకుడు కలైంజియంతో వివాదాల కారణంగా కోలీవుడ్‌లో కలకలం పుట్టించారు. ఈ మొత్తం వ్యవహారం తను దాదాపు 20 కోట్ల వరకూ నష్టపోయానని చెప్పుకొచ్చింది. వాటిని తిరిగి సంపాదించుకున్న తరావతే పెళ్ళికి సంబంధించిన వ్యవహారంపై ఆలోచిస్తాను అంటూ తెగేసి చెప్పింది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ తమిళంలో సురాజ్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రంలో జయం రవి సరసన నటిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: