ఒకొక్కసారి హీరోలు తమ సినిమా కధల ఎంపిక విషయంలో తీసుకునే నిర్ణయాలు వారికి సూపర్ హిట్ వచ్చే అవకాశాలను మిస్ చేస్తూ ఉంటాయి. గతంలో రవితేజాకు నచ్చని ‘పోకిరి’ సినిమా కధ మహేష్ ను సూపర్ స్టార్ గా మార్చింది. అదేవిధంగా అక్కినేని వారి మనవడు సుమంత్ వదులుకున్న ‘తొలిప్రేమ’ సినిమా పవన్ కళ్యాణ్ కు బ్లాక్ బస్టర్ గా మారింది. అదేవిధంగా నచ్చకుండా వదిలేసుకున్న సినిమా కధలు మన హీరోలను ఫ్లాప్ ల బారిన పడకుండా కాపాడిన సంఘటనలు కూడా ఉన్నాయి. గత వారం విడుదలైన చైతన్య ‘ఒక లైలా కోసం’ కధ చాలాకాలం బన్నీ చుట్టూ తిరిగినా అల్లుఅర్జున్ ఒప్పుకోకపోవడంతో అక్కినేని వారి ఇంట వాలింది. ఇప్పుడు ఇటువంటి సంఘటన మరొకటి జరగబోతోంది అని ఫిలింనగర్ లో వార్తలు వినిపిస్తున్నాయి.  క్రియేటివ్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న క్రిష్, గతంలో మహేష్ కోసం తాయారు చేసిన ‘శివం’ కధ ఇప్పుడు తిరిగి తిరిగి కాంపౌండ్ కు చేరింది అని టాక్. నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ తాను ప్రస్తుతం నటిస్తున్న తొలి చిత్రం ‘ముకుందా’ తరువాత క్రిష్ దర్శకత్వంలో ఇప్పటికే తయారైన ‘శివం’ సినిమా కధలో హీరోగా వచ్చే సంవత్సరం నటించబోతున్నాడు అనే వార్తలు గట్టిగా వినిపిస్తున్నాయి. మహేష్ కోసం తాయారు చేసిన ‘శివం’ కధను కొద్ది మార్పులు చేసి క్రిష్ వరుణ్ తేజ్ తండ్రి నాగబాబుకు చెప్పడంతో ఈకద నచ్చిన నాగబాబు తన కుమారుడి రెండవ సినిమాగా ఈ కధను తీద్దామని మాట ఇచ్చినట్లు టాక్. మరి మహేష్ కు నచ్చని ఈ ప్రయోగం వరుణ్ తేజ్ కు ఎంత వరకు కలిసి వస్తుందో చూడాలి...  

మరింత సమాచారం తెలుసుకోండి: