కొంతకాలంగా మౌనంగా ఉన్న దాసరి తిరిగి తన గొంతు పెంచారు. రోజురోజుకీ టాలీవుడ్ సినిమా రంగంలో రౌడీయిజం పెరిగి పోయి చిన్న సినిమాల భవిష్యత్ పెద్ద సినిమా నిర్మాతల కాళ్ళ దగ్గర నలిగి పోతోందని దాసరి సంచలన వ్యాఖ్యలు చేసారు.  అంతేకాదు ఇటువంటి పరిస్థుతులు తాను తన కళ్ళతో చూడవలసి వస్తుందని అనుకోలేదు అంటూ షాకింగ్ కామెంట్స్ చేసాడు దాసరి. విజయవంతంగా ప్రదర్శించబడుతున్నా ‘లౌక్యం’ సినిమాను ఇరు రాష్ట్రాలలోను దాదాపు 30 ధియేటర్లలో ఒక పెద్ద హీరో సినిమాకోసం తీసివేసారని అయితే ఆ సినిమా మూడు రోజులు కూడా ఆడలేదని సెటైర్ వేశారు దాసరి.  ‘లక్ష్మీ రావే మాయింటికి’ అనే సినిమా ఫంక్షన్ లో అతిధిగా పాల్గొన్న దాసరి చేసిన ఈ సంచలన వ్యాఖ్యలు పెను దుమారాన్ని సృష్టి స్తున్నాయి. అయితే దసరాకు విడుదల అయిన పెద్ద సినిమా కోసం థియేటర్స్ పోగొట్టుకున్న ‘లౌక్యం’ సినిమా వ్యవహారం పై దాసరి ఇంత ఆలస్యంగా ప్రతిస్పందించారు అనే విషయం సమాధానం లేని ప్రశ్నగా మారింది.  ఎన్ని థియేటర్స్ కబ్జా చేసినా సినిమాలలో విషయం లేకపోతే రెండవరోజే ఖాళీ అయి పోతాయి అన్న విషయం దాసరికి తెలియనిది కాదు.  

మరింత సమాచారం తెలుసుకోండి: