టాలీవుడ్ ఐరన్ లెగ్ బ్యూటీగా పేరు పొందిన ప్రణితను తాను దర్శకత్వం వహించిన ‘అత్తారింటికి దారేది’ సినిమాతో రాత్రికి రాత్రి గోల్డెన్ లెగ్ బ్యూటీగా ప్రణితను మార్చేశాడు త్రివిక్రమ్. ఆ తరువాత ప్రణిత నటించి ఎన్నో ఆశలు పెట్టుకున్న ‘రభస’ పరాజయంతో తిరిగి త్రివిక్రమ్ బన్నీతో తీస్తున్న సినిమాతో మళ్ళీ అదృష్టం కలిసి వస్తుంది అని అనుకుంది ప్రణిత. ముగ్గురు హీరోయిన్స్ నటిస్తున్న ఈ సినిమాలో ప్రణిత ఒక హీరోయిన్ గా సందడి చేయడం ఖాయం అని అనుకున్నారు అంతా.  అయితే ఏమైందో ఏమో తెలియదుకాని ఫిలింనగర్ లో వినబడుతున్న వార్తల ప్రకారం త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ప్రణిత స్థానాన్ని కేరళ కుట్టి నిత్యామీనన్ ఛాన్స్ కొట్టేసింది అనే వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. 'గుండెజారి గల్లంతయ్యిందే' తర్వాత సడన్‌గా టాలీవుడ్‌కు దూరమైన నిత్యా శర్వానంద్‌తో 'మళ్ళీ మళ్ళీ ఇది రానిరోజు', 'రుద్రమదేవి'లో స్పెషల్ రోల్ చేస్తూ తెలుగు సినిమాలకు దూరంగా ఉంటోంది. ఈమధ్యనే మణిరత్నం మూవీలో హీరోయిన్ చాన్స్ దక్కించుకుని అందర్నీ ఆశ్చర్య పరిచిన నిత్యామీనన్ కు బన్నీ పక్కన నటిస్తూ, త్రివిక్రమ్ లాంటి దర్శకుడు చేతిలో పడటం వాస్తవమే అయితే నిత్యామీనన్ కు దశ తిరిగిందనే అనుకోవాలి.  సమంత, అదా శర్మలతో పాటు నిత్యా ఈ మూవీలో మూడో హీరోయిన్‌గా నటిస్తోంది అని టాక్. అయితే తాను నటించే పాత్రలకు ప్రాముఖ్యత లేకుంటే సినిమాలు వదులుకునే నిత్య, త్రివిక్రమ్ తీస్తున్న సినిమాలో మూడవ హీరోయిన్ గా ఎలా ఒప్పుకుంది అంటూ అప్పుడే కామెంట్స్ మొదలు అయ్యాయి..  

మరింత సమాచారం తెలుసుకోండి: