అఖిల్ హీరోగా టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న తోలి సినిమాలో రాశి ఖన్నా ఎంపిక ఇంచుమించు ఖరారు అయింది అని ఈ మధ్య వార్తలు రావడంతో రాశి జాక్ పాట్ కొట్టేసింది అని అనుకున్నారు అంతా. అయితే ఆ ఆనందం ఇంకా పూర్తిగా ఎంజాయ్ చేయకుండానే రాశిఖన్నా గాయపడింది అనే వార్తలు వస్తున్నాయి.  జాన్ అబ్రహామ్ ప్రొడక్షన్ హౌస్ తీస్తున్న చిత్రం కోసం ముంబైలో ఆడిషన్ జరుగుతుండగా ఈ సినిమా దర్శక నిర్మాతలు ఆమెని స్కేటింగ్ చేయమన్నారట. ఈ సినిమాలో ఓ సీన్‌కి ఇదే హైలైట్ అవుతుందని వారు చెప్పడంతో ఏదో విధంగా ఈ సినిమా ఛాన్స్ కొట్టేదామనే ఉద్దేశంతో ఉత్సాహంగా రాశి స్కేటింగ్ చేయడానికి ప్రయత్నించి పట్టుతప్పి కిందపడిపోవడంతో ఆమె కాలికి ఫ్రాక్చర్ అయింది అని మీడియాలో వార్తలు వస్తున్నాయి.  దీనితో ఈ సినిమా నిర్మాతలు రాశిని దగ్గరలోని ఆసుపత్రికి తీసుకువెళ్లి చికిత్స చేయించారు అని తెలుస్తోంది. నడవలేని స్థితిలో ఉన్న ఆమెను కొన్ని వారాలపాటు విశ్రాంతి తీసుకోవలసిందిగా డాక్టర్లు సలహా ఇచ్చారట. ‘మద్రాస్ కేఫ్’ సినిమాలో రాశిఖన్నా జాన్ అబ్రహామ్ భార్యగా నటించి పేరు తెచ్చుకుని టాలీవుడ్ నిర్మాతలను ఆకర్షించింది.  ఈ మధ్యనే విడుదల అయిన తెలుగు సినిమా ‘‘ఊహలు గుసగుసలాడే’’ చిత్రంలో రాశి తన టాలెంట్ చూపి అందరినీ ఆకర్షించడంతో ఈమెను అఖిల్ హీరోగా నటించబోయే తోలి సినిమాలో తీసుకుంటే ఎలా ఉంటుంది అన్న ఆలోచన నాగార్జునకు వచ్చింది అన్న వార్తలు ఇప్పటికే వచ్చిన విషయం తెలిసిందే. మరి రాశికి తగిలిన ఈగాయంతో అఖిల్ సినిమాలోని హీరోయిన్ విషయంలో మార్పులు జరుగుతాయ అనే విషయం రానున్న రోజులలో తేలుతుంది..   

మరింత సమాచారం తెలుసుకోండి: