మాస్ మహారాజా రవితేజా, సంపత్ నందిల కాంబినేషన్ లో సినిమా రావడానికి రంగం సిద్ధం అయ్యింది అనే వార్తలు గట్టిగా వినిపిస్తున్నాయి. పవన్ తో ‘గబ్బర్ సింగ్ 2’ ను తీస్తాడు అనుకున్న సంపత్ నంది ఆ సినిమా ఎప్పుడు ప్రారంభం అవుతుందో తెలియని అయోమయంలో ఉన్నాడు అనే వార్తలు ఇప్పటికే వచ్చాయి. దీనికి తోడు ‘గబ్బర్ సింగ్’ సీక్వెల్ కు దర్శకుడు మారుతాడు అనే వార్తలు కుడా ఊపు అందుకున్నాయి .  ఈ వార్తలకు బలం చేకూర్చే విధంగా ఈ మధ్య సంపత్ నంది రవితేజాను కలసి ఒక కధ వినిపించినట్లు ఫిలిం నగర్ వర్గాల సమాచారం. ఈ కధ రవితేజా కు బాగా నచ్చడం తో ఆ కధకు సంభందించిన స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేస్తే వచ్చే సంవత్సరం మొదటి భాగంలో ఈ సినిమాను మొదలు పెడదామని రవి తేజా మాట ఇచ్చినట్లుగా ప్రచారం జరుగుతోంది.  ఈ వార్తలు ఇలా ఉండగా వచ్చే నెలలో ప్రారంభం అవుతుంది అని అంటున్న గబ్బర్ సింగ్ సీక్వెల్ స్క్రిప్ట్ కు సంభందించి పవన్, ‘లౌక్యం’ సినిమా రచయిత శ్రీధర్ శీపానతో కొన్నిరోజులుగా చర్చలు చేయడమే కాకుండా తానే ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తే ఎలా ఉంటుంది అనే ఆలోచనలు కుడా చేస్తున్నాడని టాక్ .  ఏమైనా పవన్ కళ్యాణ్ ఇంటి చుట్టూ గత రెండు సంవత్సరాలుగా తిరుగుతున్న సంపత్ నందికి రవితేజా బంపర్ ఆఫర్ ఇచ్చాడనే అనుకోవాలి..  

మరింత సమాచారం తెలుసుకోండి: