టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో చాలా కాలం తరువాత ఫ్యామిలీ వాతావరణం కనిపిస్తుంది అన్నంతగా మార్పులు, చేర్పులు జరుగుతున్నాయి. మేటర్ లోకి వెళితే, టాలీవుడ్ లో ఫిల్మ్ ఇండస్ట్రీలో సరికొత్త టాక్స్ వినిపిస్తున్నాయి. అలాగే సరికొత్త ఈక్వేషన్స్ కలవబోతున్నాయి. మహేష్ బాబు హీరోగా మైత్రీ మూవీస్ నిర్మించే చిత్రం షూటింగ్ ఈ నెల 30 నుంచి హైదరాబాదులో జరుగుతుంది. దీనికి 'మిర్చి' ఫేం కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పుడు ఈ మూవీలో హీరో ప్రభాస్ కి సంబంధించిన టాక్స్ ఫిల్మ్ నగర్ లో జోరుగా వినిపిస్తున్నాయి. 'ఆగడు' పరాజయంతో మహేష్ తన సినిమాల స్క్రిప్టులపై కేర్ తీసుకోవడం మొదలెట్టాడు. ఆ క్రమంలో ఆయన చెప్పిన మార్పులు చేర్పులు దీనికి చేయడం జరుగుతుంది. అలాగే డైరెక్టర్ కొరటాల శివ కూడ మహేష్ మూవీకి సంబంధించిన ఇంట్రడక్షన్ లో హీరో ప్రభాస్ వాయిస్ పెట్టాలని మహేష్ కి సూచించాడట. అందుకు మహేష్ కూడ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తుంది. గతంలో మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ మూవీ అయిన జల్సాకి మాటలు ఇచ్చాడు. ఇప్పుడు మహేష్ మూవీకి ప్రభాస్ మాటలు ఇవ్వబోతున్నాడు. కొరటాల శివ దీనికి సంబంధించిన చర్ఛలను కూడ ప్రభాస్ తో జరిపినట్టు తెలుస్తుంది. అన్ని అనుకున్నట్టు జరిగితే మహేష్ బాబు అప్ కమింగ్ ఫిల్మ్ లో ప్రభాస్ మాటలను వినొచ్చు. ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్న మహేష్ నవంబర్ 3 న ఈ సినిమా షూటింగులో జాయిన్ అవుతాడు. యాక్షన్ తో కూడిన ఫ్యామిలీ డ్రామాగా దీనిని రూపొందిస్తున్నారు. మొత్తానికి ఈ న్యూస్ మాత్రం టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారుతుంది. ఇటు మహేష్ బాబుకి, అటు ప్రభాస్ కి ఫిమేల్ ఫ్యాన్స్ ఎక్కువుగా ఉండటంతో వీరిద్దరి కాంబినేషన్ గా వస్తున్న అప్ కమింగ్ ఫిల్మ్ పై ఫ్యాన్స్ లోనూ ఆసక్తి పెరుగుతుంట. దీనికి సంబంధించిన విషయాన్ని చిత్ర యూనిట్ కొద్ది రోజుల్లోనే అఫిషియల్ అనౌన్స్ మెంట్ చేసే అవకాశం ఉందని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: