ఓ మూవీ హిట్ కావడానికి కంటే అతి ముఖ్యమైనది, ఆ మూవీపై ప్రేక్షకుల్లో పాజిటివ్ ఫీలింగ్స్ ని కలగజేయటం. ఓ మూవీ పై ఓపెనింగ్ నుండి రిలీజ్ వరకూ ఎటువంటి నెగిటివ్ ఫీలింగ్స్ రాకుండా కాపాడటం కోసం నిర్మాత నుండి చిత్ర యూనిట్ లోని ప్రతి ఒక్కరు చాలా జాగ్రత్త పడుతూ వస్తారు. అయితే దీనికి సంబంధించిన విషయంలో ఓ స్టార్ హీరో మూవీ మొదటి నుండి అనేక సమస్యలతో కొనసాగుతుంది. ఎన్టీఆర్ నటిస్తున్న తాజా చిత్రం ఫస్ట్ లుక్ ను విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా మొదటి నుంచీ అనేక సమస్యలతో సాగుతోంది. మొదట్లో కథకు మార్పులు చేయాలని ఎన్టీఆర్ పట్టుబట్టడం, తర్వాత పారితోషికాలు తగ్గించుకోవాలని నిర్మాత కోరడం వంటివి జరిగాయి. అవి పరిష్కారం అయ్యాయనుకుంటే, తాజాగా ఈ చిత్రనిర్మాణం నుంచి బండ్ల గణేష్ తప్పుకున్నాడనీ, పూరీ దీనిని టేకోవర్ చేశాడనీ కూడా ప్రచారం జరిగింది. ఈ తరహా టాక్స్ రావడానికి కారణం డైరెక్టర్ ఫూరీ జగన్నాదే అని అంటున్నారు ఫిల్మ్ నగర్ వాసులు. ఎందుకంటే పూరీ జగన్నాధ్, ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ స్టార్టింగ్ నుండి ఇప్పటి వరకూ కూడ ఎటువంటి అప్ డేట్స్, ప్రెస్ నోట్స్ ఇవ్వడం కాని జరగలేదు. మూవీపై వస్తున్న కామెంట్స్ ని ఒక్కసారి కూడ క్లియర్ చేయటానికి ప్రయత్నించలేదు. దీంతో పూరీ-జూనియర్ ల కాంబినేషన్ మొదటి నుండి అనేక అనుమాలతోనూ, సమస్యలతోనూ కొనసాగుతున్నట్టుగా మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. ఇప్పటికైన ఈ మూవీపై వస్తున్న టాక్స్ కి ఫుల్ స్టాప్ చెప్పేందుకు చిత్ర యూనిట్ ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఈ తరహా వార్తల్లో వాస్తవం లేదని చెప్పడానికి త్వరలో ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేయడానికి నిర్ణయించారట. ఈ నెలాఖరుకి దీనిని విడుదల చేస్తారని సమాచారం. ఒక్క పోస్టర్ తోనూ అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పటానికి పూరి కసరత్తులు చేస్తున్నట్టు తెలుస్తుంది. కాజల్ అగర్వాల్ ఇందులో కథానాయికగా నటిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: