వరుణ్ తేజ్ హీరోగా నటించిన ‘ముకుంద’ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్స్ పని కూడా ఇంచుమించు పూర్తి చేసుకుంటున్నా ఈ సినిమాను ఎప్పుడు విడుదల చేయాలో తెలియని అయోమయ పరిస్థితులలో ఈ సినిమా నిర్మాతలు ఉన్నారు అంటూ వార్తలు వస్తున్నాయి.  నిన్న ఆడియో విడుదల చేసుకున్న సాయి ధరమ్ తేజ్ ‘పిల్లా నువ్వు లేని జీవితం’ సినిమా నవంబర్ మూడవ వారంలో విడుదలకు సన్నాహాలు చేసుకుంటూ ఉండటంతో అదే మెగా కుటుంబానికి చెందిన వరుణ్ తేజ్ ‘ముకుంద’ ను డిసెంబర్ మూడవ వారంలో క్రిస్మస్ కు దగ్గరలో విడుదల చేద్దాము అని అనుకున్నారు.  అయితే అదే క్రిస్మస్ ను టార్గెట్ చేస్తూ శంకర్ తీసిన భారీ బడ్జెట్ సినిమా ‘ఐ’ విడుదల కాబోతోంది అనే వార్తలు కోలీవుడ్ మీడియాలో గట్టిగా వస్తూ ఉండటంతో ‘ముకుంద’ సినిమా నిర్మాతలకు టెన్షన్ మొదలైంది అనే వార్తలు ఊపు అందుకున్నాయి. ఇప్పటికే భారీ అంచనాలతో టాపిక్ ఆఫ్ సౌత్ ఇండియన్ సినిమాగా మారిన విక్రమ్ ‘ఐ’ సినిమాకు ఒక వారం ముందు లేదా మరో వారం తరువాత ‘ముకుంద’ ను విడుదల చేసినా ‘ఐ’ క్రేజ్ ముందు ఏ స్థాయిలోను ఈ సినిమా నిలబడదు సరికదా ధియేటర్స్ సమస్య ‘ముకుంద’ కు ఏర్పడుతుందని ఈ సినిమా నిర్మాతలు ఆలోచిస్తున్నారని టాక్.  ‘ఐ’ హడావిడి అయిపోయిన తరువాత సంక్రాంతికి ‘ముకుంద’ ను విడుదల చేద్దామన్నా సంక్రాంతికి రాబోతున్న ‘గోపాల గోపాల’ ముకుందుడుకు అడ్డుగా మారనున్నది అనే విషయం తెలిసిందే. ఈ పరిస్థుతులలో సినిమా నిర్మాణం అయిపోయినా ‘ముకుంద’ విడుదల కావడానికి ఫిబ్రవరి వచ్చినా ఆశ్చర్యం లేదు అనే వార్తలు వినపడుతున్నాయి.  అయితే ఏదైనా అనుకోని కారణాంతరాల వల్ల అటు ‘ఐ’ కాని ఇటు ‘గోపాల గోపాల’ కాని తమ విడుదల తేదీలకు సంబంధించి ఆఖరి నిముషంలో మార్పులు చేసుకుంటే ఆ ప్లేస్ ను ఆక్రమించడానికి ముకుందుడు అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని నవంబర్ నేలాఖరకు రెడీగా ఉండబోతున్నాడు అనే వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి..  

మరింత సమాచారం తెలుసుకోండి: