టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో సంక్రాంతి వార్ జరగబోతుంది. ముఖ్యంగా గత కొంత కాలంగా చాలా నెమ్మదిగా షూటింగ్ జరుపుకుంటున్న గోపాల గోపాల మూవీ, ఇప్పుడు పోస్ట్ ప్రొడక్షన్ పనులని శరవేగంగా జరుపుకుంటుంది. అంతే కాకుండా మూవీకి సంబంధించిన ఫస్ట్ లుక్స్, ట్రైలర్స్ కూడ రెడీ చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ మూవీకి ధీటుగా జూనియర్ ఎన్టీఆర్, పూరీ జగన్నాధ్ కాంబినేషన్ లో వస్తున్న మూవీ కూడ సంక్రాంతి బరిలోకి రెడీ అవుతుంది. దీంతో 2015 సంక్రాంతి ఫెస్టివల్ ఇద్దరి స్టార్ హీరోల మధ్య వార్ జరగబోతుంది. హిందీ చిత్రం 'ఓ మైగాడ్'ని తెలుగులో 'గోపాల గోపాల' టైటిల్ తో రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే. వెంకటేష్, పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో ఈ చిత్రం రీమేక్ అవుతోంది. హిందీ వెర్షన్లో అక్షయ్ కుమార్ పోషించిన శ్రీకృష్ణుడి పాత్రను తెలుగులో పవన్ కళ్యాణ్ చేయగా, పరేష్ రావల్ పోషించిన వ్యాపారి పాత్రలో వెంకటేష్ నటించాడు. సంక్రాంతికి ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని నిర్మాతలు కూడ కచ్ఛితమైన డేట్స్ ని ఇప్పటికే అనుకున్నట్టు పోస్ట్ ప్రొడక్షన్ టీం నుండి అందుతున్న సమాచారం. ఈ చిత్రానికి అనూప్‌రూబెన్స్‌ సంగీతం అందిస్తున్నారు. ఇక ఈ చిత్రంలో పవన్‌ పలికే సంభాషణలు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయని సమాచారం.  ఇదిలా ఉంటే, గోపాల గోపాల మూవీలో శ్రియ ముఖ్యపాత్రలో కనిపిస్తుంది. అయితే గోపాల మూవీకి ధీటుగా జూనియర్ ఎన్టీఆర్ మూవీలోనూ చాలా హైలెట్స్ ఉన్నాయంటూ పబ్లిసిటి స్టంట్ ని స్టార్ట్ చేస్తున్నారు. మొత్తంగా జూనియర్ ఎన్టీఆర్ ఎన్నో ఆశలు పెట్టుకున్న పూరీ మూవీపై మల్టీస్టారర్ మూవీ ఏ విధమైన ప్రభావం చూపిస్తుందో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: