మోమన్ బాబు ఏ విషయాన్ని అయినా చాల ముక్కు సూటిగా మాట్లాడుతాడు. అలా మాట్లాడటం వల్ల చాలామంది ఆయనకు శత్రువులుగా కూడా మారుతారు. అయినా ఆయన రూటే సెపరేటు. ఈరోజు తన కొడుకు మంచు విష్ణు నిర్మాతగా 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బేనర్లో మంచు మనోజ్, రాకుల్ ప్రీత్ సింగ్, సన్నీ లియోన్ మరియు జగపతి బాబు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ‘కరెంటు తీగ' సినిమా ప్లాటినమ్ డిస్క్ వేడుక రెండురోజుల క్రితం హైదరాబాద్ లోని నారాయణమ్మ ఇంజనీరింగ్ కాలేజీలో జరిగింది.  అక్కడ ఏర్పాటు చేసిన ఈ సినిమా ఫంక్షన్ లో మాట్లాడుతూ అమ్మాయిలు సెల్ ఫాన్స్ ఎలా ఉపయోగించు కోవాలో తెలుసుకోవడం మంచిదే కాని రోజంతా వాటికే అతుక్కు పోకుండా ఉంటే చాల బాగుంటుంది అని అంటూ అమ్మాయిలు తమ వస్త్ర ధారణ విషయంలో ముఖ్యంగా మిడ్డీలు లాంటి మోడ్రన్ డ్రస్సులకు దూరంగా ఉంటే మంచిదని అభిప్రాయ పడ్డాడు మోహన్ బాబు.  అందుకోసమే తాను నడుపుతున్న ఇంజనీరింగ్ కాలేజీలలో మిడ్డీలు, సెల్ ఫోన్స్ కు అనుమతి ఉండదు అని కామెంట్స్ విసిరాడు మోహన్ బాబు. అదేవిధంగా అమ్మాయిలు తమ నీడలను కూడా నమ్మకూడదు అని అంటూ ఎక్కడికి వెళ్లినా ఒంటరిగా కాకుండా అంతా కలిసి వెళ్లాలి అని హితబోధ చేసాడు మోహన్ బాబు.  అయితే మోడ్రన్ వస్త్ర ధారణకు, సెల్ ఫోన్స్ కు దూరంగా ఉన్నంత మాత్రాన అమ్మాయిలకు సమస్యలు ఉండవు అని మోహన్ బాబు చెపుతున్న మాటలు ప్రస్తుత కాలమాన పరిస్థుతులలో జరిగే పనేనా అని ఎవరికైనా అని పిస్తుంది..   

మరింత సమాచారం తెలుసుకోండి: